భారత క్రికెట్ జట్టు అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీ కోసం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సంగతి విదితమే. ఐదవ టెస్టులో ఒకవైపు మైదానంలో భారత బ్యాటర్లు పోరాటం చేస్తుంటే, మరొకవైపు కామెంటరీ బాక్స్లో అసాధారణ అతిథి సందడి చేశారు.ఆయనెవరో కాదు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్. శనివారం లండన్లోని ఓవల్ స్టేడియంలో జరిగిన భారత్ vs ఇంగ్లాండ్ ఐదవ టెస్ట్ మూడవ రోజు.. కామెంటరీ బాక్స్లో సుందర్ పిచాయ్ ని చూసిన అభిమానులను ఒక్కసారిగా ఆశ్చర్యంలో మునిగిపోయారు. 4 మ్యాచ్ల తర్వాత ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలో ఉండటంతో, రెండు జట్ల మధ్య 5వ, చివరి మ్యాచ్ లండన్ ఓవల్లో జరుగుతోంది.
భారతదేశం యొక్క రెండవ ఇన్నింగ్స్లో వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చినప్పుడు సుందర్ పిచాయ్.. హర్ష భోగ్లేతో కలిసి మైక్ పంచుకున్నారు. సుందర్ పిచాయ్ కామెంటరీ చేస్తున్నప్పుడు హర్ష భోగ్లే .. నేను ఉత్తముల పక్కన కూర్చున్నాను" అని అభినందనలుతెలిపారు. దానికి సుందర్ పిచాయ్ ఆసక్తికరంగా, "నేను కూడా ఉత్తముల పక్కన ఉన్నాను" అని స్పందించారు.ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు కామెంట్లతో హోరెత్తించారు. టెక్ ప్రపంచం నుంచి క్రికెట్ కామెంటరీ బాక్స్కు వచ్చిన ఈ ప్రయాణం అభిమానుల్ని ఆకట్టుకుంది. "సుందర్ బ్యాట్ చేస్తుంటే... సుందర్ మైక్ అందుకుంటున్నాడు అంటూ నెటిజన్లు ట్వీట్ చేశారు.
సిరీస్ గురించి పిచాయ్ మాట్లాడుతూ.. ఈ సిరీస్ చాలా బాగుంది. రెండు జట్లు తీవ్రంగా పోరాడాయి. రెండు జట్లు గొప్ప కృషి, పోటీతత్వాన్ని ప్రదర్శించాయని ఆయన ప్రశంసించారు. నేను చెప్పాల్సి వస్తే, సిరీస్ 2-2తో డ్రాగా ముగుస్తుంది. భారతదేశం చివరి మ్యాచ్లో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీని తర్వాత, హర్ష భోగ్లే తన X సైట్లో "నేను ఇంత ఉన్నత స్థాయి కార్పొరేట్ నాయకుడితో ఎప్పుడూ వ్యాఖ్యానించలేదు. క్రికెట్ ప్రేమికుడు, చాలా సింపుల్. SundarPichai అని పోస్ట్ చేశారు.

సుందర్ పిచాయ్ ఒక భారతీయ-అమెరికన్ వ్యాపార కార్యనిర్వాహకుడు. ఆయన ఆల్ఫాబెట్ ఇంక్. గూగుల్ లకు CEO. తమిళనాడులోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన సుందర్ పిచాయ్ 2004 లో గూగుల్ లో చేరారు. గూగుల్ వృద్ధిలో సుందర్ పిచాయ్ పాత్ర చాలా ముఖ్యమైనది. తన ప్రతిభ కారణంగా, 2015 లో గూగుల్ CEO గా బాధ్యతలు స్వీకరించారు. సుందర్ పిచాయ్ చాలా కాలంగా కంపెనీలో అత్యున్నత పదవిని నిర్వహిస్తున్నారు.
మొత్తం 5 టెస్ట్ల సిరీస్ అయిన ఈ మేచ్సిరీస్లో, ఇంగ్లండ్ ప్రస్తుతం 2-1 లీడులో ఉంది. తొలి టెస్ట్ను ఇంగ్లండ్ గెలిచింది, రెండో టెస్ట్ లో భారత్ గెలిచింది. ఇక మూడో టెస్ట్ రోజులో, ఇంగ్లండ్ లార్డ్'סలో 22 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ను 2-1కి మార్చుకుంది. నాలుగో టెస్ట్లో మాంచెస్టర్లో డ్రాగా ముగిసింది. ఐదో టెస్ట్ నేడు చివరి రోజు జరుగుతోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications