Thierry Delaporte: దేశంలోని టెక్ దిగ్గజాల్లో ఒకటిగా కొనసాగుతున్న విప్రోకు వరుస కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. అసలే వ్యాపార పరిస్థితులు అస్థిరంగా కొనసాగుతున్న వేళ కొత్త కష్టాలు చుట్టుముడుతూ ఊపిరాడకుండా చేస్తున్నాయి.
తాజాగా విప్రో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(CEO) థియరీ డెలాపోర్టే రాజీనామా చేసినట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో ప్రకటించింది. దీంతో టెక్ దిగ్గజం విప్రో ఆయన స్థానంలో శ్రీనివాస్ పల్లియాను కొత్త సీఈవో అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. థియరీ డెలాపోర్టే రాజీనామా ఏప్రిల్ 6, 2024 నుంచి అమలులోకి వచ్చే విధంగా బోర్డు నిర్ణయం తీసుకుంది. అతను మే 31, 2024న పని వేళలు ముగిసే సమయానికి కంపెనీ ఉద్యోగం నుండి విముక్తి పొందుతారని కంపెనీ వెల్లడించింది.

కంపెనీ అమెరికాస్ 1 ఏరియాకు CEO అయిన శ్రీనివాస్ పల్లియా ఏప్రిల్ 7 నుంచి కొత్త సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. డెలాపోర్టే 56ను విప్రో జూలై 2020లో సీఈవో అండ్ ఎండీగా నియమించిన సంగతి తెలిసిందే. దీనికి ముందు ఆయన క్యాప్జెమినీలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO)గా పనిచేశారు. గత డిసెంబరులో డెలాపోర్టే ఏడాదికి రూ.82 కోట్లకు పైగా జీతం ప్యాకేజీని పొందుతూ దేశంలో అత్యధికంగా వేతనం పొందుతున్న ఐటీ కంపెనీ సీఈవోగా నిలిచారు. ప్రస్తుతం పారిస్ లో నివసిస్తున్న ఆయన ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీల్లో పనిచేసిన అనుభవం కలిగి ఉన్నారు.
మార్చిలో విప్రో ఆరుగురు ఉద్యోగులను సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పాత్రలకు మరియు 25 మందిని వైస్ ప్రెసిడెంట్ పాత్రలకు పదోన్నతి కల్పించింది. అయినప్పటికీ గత ఏడాది నుంచి కంపెనీలో ఉన్నత స్థాయి ఉద్యోగుల నిష్క్రమణలు కొనసాగుతూనే ఉన్నాయి. వివరాల్లోకి వెళిత.. ఫైనాన్స్ చీఫ్ జతిన్ దలాల్, చీఫ్ గ్రోత్ ఆఫీసర్ స్టెఫానీ ట్రౌట్మన్, డిజిటల్ అండ్ క్లౌడ్ హెడ్ బరత్ నారాయణన్తో సహా చాలా మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్లు గత సంవత్సరంలో విప్రోను వీడారు. కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంస్థ తక్కువ మంది సీనియర్ ఉద్యోగులను ప్రమోట్ చేసింది.
More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications