IT News: దేశంలోని అతిపెద్ద టెక్ దిగ్గజంగా టీసీఎస్ కొనసాగుతోంది. అయితే కొత్త ఏడాది కంపెనీ ఉద్యోగులకు జీతాల చెల్లింపు నిలిపివేయటం సంచలనంగా మారింది. దీంతో టెక్కీలు ఒక్కసారిగా షాక్కి గురవుతున్నారు.
సాధారణంగా ఇల్లు నడవాలన్నా రోజువారీ అవసరాలకోసమైనా ఉద్యోగులు మెుదటి తారీఖున పడే జీతం కోసం వేచి ఉంటారు. దీనికి తోడు చాలా మంది టెక్కీలకు హోమ్ లోన్, పర్సనల్ లోన్ అంటూ వివిధ చెల్లింపులు కూడా ఉంటుంటాయి. అయితే ఈ సారి టెక్ దిగ్గజం టీసీఎస్ ఇచ్చిన షాక్ కొత్త ఏడాది వారి మైండ్ పోగొడుతోంది. ఇటీవల కంపెనీ మూడు పెద్ద డీల్స్ కోల్పోయింది. దీంతో కంపెనీ ఆదాయాలు సైతం భారీగానే దెబ్బతిన్నాయి.

ఈ క్రమంలో ఉద్యోగుల పనితీరును మెరుగుపరచడానికి, క్లిష్టమైన ప్రాజెక్ట్ను సజావుగా అమలు చేయడానికి దాదాపు 2000 మంది ఉద్యోగులను ట్రాన్స్ఫర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కంపెనీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేటాయించిన ప్రదేశానికి వెళ్లేందుకు నిరాకరించిన దాదాపు 900 మంది టెక్కీలకు టీసీఎస్ జీతాల చెల్లింపును నిలిపివేయటం సంచలనంగా మారింది. గతంలో కంపెనీ అకస్మాత్తుగా 2000 మందిని బదిలీ చేయటాన్ని NITES తప్పుపట్టిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు బదిలీని వ్యతిరేకించిన 900 మంది ఉద్యోగుల జీతాలు నిలిపివేయబడ్డాయి.
నవంబర్ 2023లో కంపెనీ వ్యాపార అవసరాలకు అనుగుణంగా కొందరు ఉద్యోగులను రెండు వారాల్లో కేటాయించిన ఆఫీసుల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ సుమారు 300 మంది ఉద్యోగుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు NITES కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖకు లేఖ పంపటం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కంపెనీ నిబంధనలు పాటించనందున కొత్త కార్యాలయాలకు రిపోర్ట్ చేయని ఉద్యోగులపై కంపెనీ ప్రస్తుతం కన్నెర్ర చేసింది.
ఇదే విషయాన్ని ఉద్యోగులకు కంపెనీ మేనేజ్మెంట్ మెయిల్ ద్వారా వెల్లడించగా.. టెక్కీలను నిర్దిష్ట పోర్టల్లను ఉపయోగించకుండా నిరోధించినట్లు వెల్లడైంది. మెుత్తానికి మాట వినని టెక్కీలకు బుద్ధి చెప్పాలని భావించిన టీసీఎస్ కఠినంగా వ్యవహరిస్తూ వారి వేతనాలను నిలిపివేయటం చాలా మందిని భయాలకు గురిచేస్తోంది.
More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications