Infosys: భారతీయ టెక్ రంగంలో అనేక మార్పులు ఇటీవలి కాలంలో ఉద్యోగులకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ కొత్త ఎత్తుగడతో వచ్చేసింది. దీని ప్రభావం గురించి ప్రస్తుతం టెక్కీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దేశంలోని టాప్-5 IT సేవల దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ ఇంజనీరింగ్-ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ప్రాజెక్ట్లలో పాల్గొన్న ఉద్యోగుల కోసం 'ఇన్-పర్సన్ కొల్లాబ్ వీక్స్'ని అమలు చేస్తోంది. దీని ప్రకారం సదరు ప్రాజెక్టుల్లో పనిచేసే టెక్కీలు కంపెనీ సూచించిన వారాల్లో సంబంధిత క్యాంపస్లలో హాజరుకావాల్సి ఉంటుంది. పరోక్షంగా చెప్పాలంటే ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుందా అనే అనుమానాలు చాలా మంది ఉద్యోగుల్లో వినిపిస్తున్నాయి.

దీని కింద ప్రతి త్రైమాసికంలో వ్యక్తిగత సహకారం కోసం కంపెనీ నిర్దిష్ట వారాలను నిర్దేశిస్తుంది. ఇందుకోసం ఇకపై ఇన్ఫోసిస్ ఉద్యోగులు నెలలో కనీసం 10 రోజులు కార్యాలయం నుంచి పని చేయడం తప్పనిసరిగా మారనుంది. ఉద్యోగులకు కంపెనీ దీనికి సంబంధించిన వివరాలను ఇప్పటికే మెయిల్ ద్వారా వెల్లడించటంతో విషయం బయటకు వచ్చింది. దీనికి ముందు గత ఏడాది నవంబరులో కంపెనీ తెచ్చిన హైబ్రిడ్ వర్క్ పాలసీ కింద ప్రతిఒక్కరు నెలలో 10 రోజుల చొప్పున త్రైమాసికంలో 30 రోజులు ఆఫీసులకు రావాల్సిందే. ఈ హైబ్రిడ్ వర్క్ అప్రోచ్ ద్వారా టీమ్ వర్క్, ఉత్పాదకతను పెంపొందించడం ఇన్ఫోసిస్ లక్ష్యం.
అయితే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కొల్లాబ్ వీక్స్లో పాల్గొనే ఉద్యోగుల ఖచ్చితమైన సంఖ్య ఇంకా నిర్ణయించబడలేదు. 10 రోజుల వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నిబంధనపై మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, క్యాంపస్ హాజరును పెంచాలని ఇన్ఫోసిస్ చూస్తోంది. ఆఫీసు టర్నింగ్ను పెంచడానికి కంపెనీ క్రమబద్ధమైన మెరుగుదలలను ప్లాన్ చేస్తుంది. వ్యాపార వృద్ధిని నడపడానికి ఉద్యోగుల మధ్య సహకారం, ఆవిష్కరణలను పెంపొందించడం ఈ చర్య లక్ష్యమని తెలుస్తోంది.
ENG-IoT ప్రాజెక్ట్లలో ఇన్-పర్సన్ కొల్లాబ్ వీక్స్ పరిచయం ఇన్ఫోసిస్లో టీమ్వర్క్, సహకారాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ తన కొత్త నిర్మాణంలో ప్రాజెక్ట్ లైఫ్సైకిల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ IoT, నాలెడ్జ్-బేస్డ్ ఇంజనీరింగ్, స్మార్ట్ ప్లేస్ల వంటి వివిధ రంగాలను ఏకీకృతం చేసింది. దీనికి తగినట్లుగా ఉద్యోగులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని కంపెనీ తాజా మెయిల్ ద్వారా తెలియజేసింది.
More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications