HCL Tech News: దేశీయ టాప్ టెక్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న హెచ్సీఎల్టెక్ తాజాగా తన రెండవ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ క్రమంలో కంపెనీ తాజాగా ఉద్యోగులకు వేతన పెంపులపై కీలక ప్రకటన చేసింది. గడచిన కొన్నేళ్లుగా ఐటీ రంగంలో అలుముకున్న అనిశ్చితులు ప్రస్తుతం తగ్గటంతో టెర్ పరిశ్రమలోని కంపెనీలు ఉద్యోగులకు శాలరీ హైక్స్ ప్రకటిస్తున్నాయి.
ఈ క్రమంలోనే అక్టోబర్ నుంచి తమ టెక్కీలకు 7 శాతం జీతాల పెంపును అమలు చేయనుంది. ఇదే క్రమంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన టెక్కీలకు మాత్రం శాలరీ హైక్ 12-15 శాతం మధ్య ఉండనుందని తెలుస్తోంది. మూడవ త్రైమాసికంలో తమ ఆపరేటింగ్ మార్జిన్లపై వేతనాల పెంపు ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని అంచనా వేసినట్లు కంపెనీ చీఫ్ పీపుల్ ఆఫీసర్ రామచంద్రన్ సుందరరాజన్ తెలిపారు. తాజాగా వేతన పెంపులు అక్టోబర్ నుంచి అమలులోకి వస్తాయని కంపెనీ క్యూ2 ఫలితాల సమయంలో వెల్లడించింది.

పనితీరు ఆధారిత ఇంక్రిమెంట్లలో టాప్ పెర్ఫార్మర్లు రెండంకెల పెరుగుదలను అందుకుంటారని సుందరరాజన్ పేర్కొన్నారు. టాప్ పెర్ఫార్మర్ టెక్కీలకు 12-14 శాతం మధ్య హైక్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో దేశీయంగా మూడవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థగా ఉన్న హెచ్సీఎల్ టెక్ ఉద్యోగుల సంఖ్య క్యూ2లో 2,18,621గా ఉంది. ఎంత మంది ఉద్యోగులు హైక్ పొందటానికి అర్హులు అనే సంఖ్యలు కంపెనీ రివ్యూ సైకిల్ పై ఆధారపడి ఉంటాయని సుందరరాజన్ తెలిపారు. ఈ క్రమంలో లేటరల్ ఎంట్రీ ద్వారా వచ్చిన ఉద్యోగులు ఏడాది సర్వీస్ పూర్తి చేసుకుంటేనే హైక్ పొందటానికి అర్హత పొందుతారని ఆయన తెలిపారు.
జీతాల పెంపుదల ఆపరేటింగ్ మార్జిన్లను కొద్దిగా మాత్రమే ప్రభావితం చేస్తుందని సుందరరాజన్ అంగీకరించారు. అయితే సమర్థత చర్యల ద్వారా దీనిని భర్తీ చేసేందుకు కంపెనీ ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. హైక్స్ గడచిన ఏడాది మాదిరిగానే యాన్యువల్ కంపెన్సేషన్ రివ్యూ ప్రాసెస్ ప్రకారం జరగనున్నట్లు పేర్కొన్నారు. నోయిడా ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న కంపెనీ హెడ్ కౌంట్ రెండవ త్రైమాసికంలో 780 తగ్గుదలను చూసింది. రెండవ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 11 శాతం పెరిగి రూ.4,235 కోట్లకు చేరుకోగా, ఆదాయం వార్షిక ప్రాతిపదికన 8.2 శాతం పెరిగి రూ.28,862 కోట్లుగా నమోదైంది.
ఐటీ సేవలకు డిమాండ్ మందగించిన వాతావరణంలో కంపెనీలు ఖర్చులను తగ్గించుకునేందుకు మూడో త్రైమాసికానికి వేతన పెంపులను వాయిదా వేస్తుండగా.. బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ ప్రధానంగా హైక్ సైకిల్ మార్పు, సాధారణ కాలానుగుణ పెరుగుదల కారణంగా ఆపరేటింగ్ మార్జిన్లలో 110 బేసిస్ పాయింట్ సీక్వెన్షియల్ పెరుగుదలను అంచనా వేసింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications