Work From Home: ప్రపంచ వ్యాప్తంగా ఐటీ సేవల రంగంలో వ్యాపారాలు చేస్తున్న చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. చాలా కంపెనీల్లో ఉద్యోగులు ఈ వార్తతో సంతోషంగా లేరు. ఆఫీసులకు వారంలో కొన్నిరోజులైనా రావాల్సిందేనని తేల్చి చెప్పాయి.
ఈ పరిస్థితిలో ఉద్యోగుల పనితీరు మెరుగుపరచటమే లక్ష్యంగా టెక్ కంపెనీలు ముందుకు సాగుతున్నాయి. అయితే అనేక కంపెనీల మాదిరిగా కాకుండా టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ తన ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రావాల్సిందేనంటూ బలవంతం చేయటం లేదని వెల్లడైంది. సోషల్ క్యాపిటల్ ప్రాముఖ్యతను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈవో రవికుమార్ వెల్లడించారు. వ్యాపారాన్ని తిరిగి వృద్ధి బాటలో ఉంచడానికి తమ వద్ద తగినంత మంది ఫ్రెషర్లు ఉన్నారని పేర్కొన్నారు.

కాగ్నిజెంట్లోని ఫ్లెక్సిబిలిటీ వాస్తవానికి ఎక్కువ మంది మహిళలు ఉద్యోగాల్లో కొనసాగించడంలో, కొత్త మహిళా ఉద్యోగులను చేర్చుకోవడంలో సహాయపడుతుందని సీఈవో రవి కుమార్ వెల్లడించారు. భారతదేశంలో పనిచేస్తున్న ప్రముఖ IT సేవల కంపెనీల్లో కాగ్నిజెంట్ రియల్ ఎస్టేట్ ఖర్చులను తగ్గించుకోవటంలో చాలా చురుకుగా ఉంది.
కంపెనీ పెద్ద నగరాల్లో 80 వేల సీటింగ్ కెపాసిటీని తగ్గించిందని ఇన్వెస్టర్ల సమావేశంలో సీఈవో వెల్లడించారు. దీనిలో కొంత భాగాన్ని టైర్-2 నగరాలకు మార్చాలని చూస్తున్నట్లు చెప్పారు. కాగ్నిజెంట్ తన సిబ్బంది, రియల్ ఎస్టేట్ ఖర్చులను తగ్గించడం ద్వారా కంపెనీ నిర్వహణ వ్యయ మార్జిన్ను పెంచుకోవాలని చూస్తోంది. దీని ద్వారా సీఈవో రవికుమార్ దాదాపు 400 మిలియన్ డాలర్ల విలువైన పొదుపు పథకాన్ని ప్రారంభించారు. ఇదిలా ఉండగా మరోపక్క టెక్ దిగ్గజం గూగుల్ ఆన్ క్యాంపస్ హోటల్ ఆఫర్ చేస్తోంది. దీని ద్వారా ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు వచ్చేలా ఆకర్షించాలని నిర్ణయించింది.
More From GoodReturns

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

ఇరాన్ వార్ దెబ్బకు వణుకుతున్న భారత ఐటీ సెక్టార్.. తీవ్ర ప్రమాదంలో కీలక ప్రాజెక్టులు..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications