Accenture News: ఐటీ కంపెనీల గురించి రోజుకొక సంచలన వార్త వెలుగులోకి వస్తోంది. ఈ క్రమంలో దిగ్గజ కంపెనీల దారి ఇప్పుడు ఒక్కటేనని తెలుస్తోంది. దేశీయ కంపెనీలతో పాటు గ్లోబర్ టెక్ కంపెనీలు సైతం అలాగే ప్రవర్తిస్తున్నాయి.
మునుపటి నెలలో టెక్ దిగ్గజం యాక్సెంచర్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగులకు వేతన పెంపులను తాత్కాలికంగా నిలిపివేయాలనే తన నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటించింది. అయితే ఇంక్రిమెంట్లు చట్టబద్ధంగా అవసరమయ్యే లేదా ముఖ్యమైన నైపుణ్యం ఉన్న రంగాల్లో అవసరమైన మేరకు మాత్రమే అందించనున్నట్లు స్పష్టం చేసింది.

కంపెనీ తీసుకున్న నిర్ణయాన్ని మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ విజ్ ఈ-మెయిల్ ద్వారా ఉద్యోగులకు తెలియజేశారు. ఇదే క్రమంలో యాక్సెంచర్ ప్రమోషన్లు, ప్రోత్సాహకాలపై దాని వ్యూహాన్ని మార్చుకుంది. పనితీరు-ఆధారిత ప్రోత్సాహకాలు అందించబడతాయని ఊహించబడినప్పటికీ.. గత సంవత్సరంతో పోలిస్తే వాటి పరిమాణం చాలా తక్కువగా ఉంటుందని అంచనా వేయబడింది. అసోసియేట్ డైరెక్టర్ స్థాయి (లెవల్ 5) వరకు ప్రమోషన్లు డిసెంబర్లో షెడ్యూల్ చేయబడ్డాయి.
ఇదే క్రమంలో లెవల్ 1 నుంచి 4లోపు స్థాయి ఉద్యోగులకు పదోన్నతులు 2024 జూన్ నెల వరకు వాయిదా వేయబడ్డాయి. ప్రపంచ వ్యాపార వాతావరణం డైనమిక్స్ మారుతున్న తరుణంలో కంపెనీ ఆచితూచి ముందుకు అడుగులు వేస్తోంది. భారతీయ టెక్ కంపెనీలు సైతం ఉద్యోగులకు పెద్దగా వేతన పెంపులను అందించటం లేదు. అధిక వేతనాన్ని పొందుతున్న వ్యక్తులకు హైక్స్ వాయిదా వేస్తున్నాయి. ఈ క్రమంలో యాక్సెంచర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) పై గణనీయంగా 3 బిలియన్ డాలర్లను వెచ్చిస్తోంది. ఈ డొమైన్లో మొత్తం 80,000 మంది ఉద్యోగులను పెంచే యోచనలో ఉంది.
More From GoodReturns

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరల పెరుగుదలపై దిమ్మతిరిగే న్యూస్.. గత చరిత్రతో కీలక నివేదికను విడుదల చేసిన Kedia Advisory

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

Bengaluru: టీసీఎస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! మీ స్నేహితుడిని చేర్పించండి.. రూ. 40,000 గెలుచుకోండి!

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

Gold: బంగారం ధరలు తగ్గేది అందుకు కాదు! అసలు విషయం బయటపెట్టిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈఓ!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

పెరుగుతున్న బంగారం ధరలు.. అదే స్థాయిలో పెరుగుతున్న పసిడి రుణాలు.. ఎందుకు తాకట్టు పెడుతున్నారు..

బంగారం ధర పెరగడంతో వినియోగదారులు కొత్త స్కెచ్.. రూ.4 లక్షల కోట్లు దాటిన పసిడి రుణాలు..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?



Click it and Unblock the Notifications