IT News: చాలా కాలంగా ఉద్యోగులను కలవరపెడుతున్న అసలు విషయం జాబ్ గ్యారెంటీ. ప్రస్తుతం మారిపోతున్న టెక్నాలజీలు, వేగంగా మారిపోతున్న జాబ్ మార్కెట్ వంటి కీలక పరిణామాల మధ్య మనుగడపై ఆందోళనలు టెక్కీల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి.
వీటిలో మరీ ముఖ్యంగా ఇబ్బంది పెడుతున్న విషయం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్. ఇది మానవుల మేధస్సు కంటే అనేక రెట్లు ఎక్కువగా పనిచేయటం వల్ల తమ ఉద్యోగాలు పోతాయని చాలా మంది టెక్కీలు భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ పనులను పూర్తి చేసేందుకు ఏఐ టూల్స్ విరివిగా వినియోగిస్తున్నారు. తద్వారా ఖర్చులు తగ్గించుకోవచ్చని కంపెనీలు భావిస్తున్న మాట కూడా వాస్తవమే. దీనికి ఉదాహరణ గతంలో టెక్నాలజీ దిగ్గజమైన ఐబీఎమ్ చేసిన ప్రకటన.

అయితే తాజాగా AI ఆందోళనల గురించి టెక్ మహీంద్రా ఎండి, సీఈవో మోహిత్ జోషి శనివారం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టెక్నాలజీ రెవల్యూషన్ లో భారత్ ఇప్పటికీ ప్రారంభదశల్లోనే ఉందని పేర్కొన్నారు. అలాగే రాబోయే పదేళ్ల కాలంలో టెక్ రంగంలో ప్రతి సంవత్సరం దశాబ్దాల విలువైన మార్పును తప్పక చూడాల్సి ఉంటుందని వెల్లడించారు. ఈ మార్పులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జెనోమిక్స్, నానోటెక్నాలజీ, రోబోటిక్స్లో పురోగతి ద్వారా నడపబడతాయని అన్నారు.
IIM నాగ్పూర్లోని 'జీరో మైల్ సంవాద్'లో మాట్లాడుతూ మోహిత్ AI ప్రోగ్రామింగ్ ఉద్యోగాలను అనవసరంగా చేస్తుందా అనే అంశంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఏఐ ప్రోగ్రామింగ్ ను మరింత సులభతరం చేయటంలో దోహదపడుతుందని అన్నారు. యావరేజ్ ప్రోగ్రామర్ సైతం గతంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన వారితో సమానం చేస్తుందని అన్నారు. ఈ సాంకేతికత విన్నర్స్, రన్నర్స్ ను సృష్టించినప్పటికీ ఎక్కువగా విజేతలు ఉంటారని అభిప్రాయపడ్డారు.
రానున్న దశాబ్ద కాలంలో టెక్ రంగం డబుల్ డిజిట్ గ్రోత్ నమోదు చేస్తుందని అన్నారు. ఐటీ సేవల పరిశ్రమ భవిష్యత్తులో చాలా పెద్దదిగా మారుతుందని, అందుకు అనుగుణంగా ప్రతిభకు డిమాండ్ ఉంటూనే ఉంటుందని జోషి పేర్కొన్నారు. అయితే మెుత్తానికి AI కారణంగా ప్రోగ్రామింగ్ ప్రతిభకు డిమాండ్ తగ్గే ప్రమాదాలు లేవని మోహిత్ చెప్పకనే చెప్పారు.
More From GoodReturns

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

ఇరాన్ వార్ దెబ్బకు వణుకుతున్న భారత ఐటీ సెక్టార్.. తీవ్ర ప్రమాదంలో కీలక ప్రాజెక్టులు..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications