IT News: ఒకపక్క ఐటీ రంగంలో అనిశ్చితులు, తగ్గిన ఆదాయాలు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ భారత టెక్ కంపెనీలు మెరుగైన పనితీరు కనబరిచేందుకు కృషి చేస్తున్నాయి. అలాగే తమ ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు రంగంలోకి దిగాయి.
ఈ క్రమంలో ముందుగా టెక్ దిగ్గజం టీసీఎస్ నిన్న తన సెప్టెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. కంపెనీలో పనిచేస్తున్న వారిలో దాదాపు 70 శాతం జూనియర్ టెక్కీలే.. వీరందరికీ 100 శాతం వేరియబుల్ వేతనాన్ని చెల్లించాలని నిర్ణయించినట్లు చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ తెలిపారు. అలాగే మిగిలిన టెక్కీలకు వారి వ్యాపార యూనిట్ పనితీరు ఆధారంగా వేతనం ఉంటుందని స్పష్టం చేశారు. కంపెనీ మెుదటి త్రైమాసికంలో తన ఉద్యోగులకు 100 శాతం వేరియబుల్ వేతనాన్ని చెల్లించిన సంగతి తెలిసిందే.

ఇక మరో టాప్ టెక్ కంపెనీగా కొనసాగుతున్న విప్రో పండుగకి ముందరే ఉద్యోగులకు సూపర్ న్యూస్ తెలిపింది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న కంపనీ మెుదటి త్రైమాసికంలో 80 శాతం వేరియబుల్ వేతనాన్ని ఉద్యోగులకు చెల్లించింది. అయితే వ్యాపారంలో నెలకొన్ని పరిస్థితుల దృష్ట్యా హైక్స్ తాత్కాలికంగా నిలిపివేసింది. కానీ ఇప్పుడు దీనికి సంబంధించిన గుడ్ న్యూస్ వెల్లడించింది.

విప్రో తన ఉద్యోగులకు వేతన పెంపులను డిసెంబర్ 1 నుంచి అందించనున్నట్లు ప్రకటించింది. మెుదటి త్రైమాసిక ఫలితాలు వెలువరించిన తర్వాతే ఇది జరగాల్సి ఉన్నప్పటికీ వాటిని అప్పట్లో వాయిదా వేసింది. రానున్న కొన్ని వారాల్లో పెరిగిన వేతనాలను అందుకోవచ్చని విప్రో చీఫ్ హ్యూమన్ రీసోర్సె్స ఆఫీసర్ సౌరభ్ గోవిల్ గతవారం ఉద్యోగులకు పంపిన ఈమెయిల్ పరిశీలిస్తే అర్థం అవుతోంది. వేతన పెంపులు ఉద్యోగుల పనితీరు ఆధారంగా ఉండనున్నాయి. ఈ క్రమంలో దిగ్గజం టీసీఎస్ మాత్రం 2023-24 ఆర్థిక సంవత్సరానికి తన ఉద్యోగులకు వేతన పెంపులను అందించింది. హెచ్సీఎల్ టెక్నాలజీస్ మాత్రం ఈ ఆర్థిక సంవత్సరం సీనియర్ ఉద్యోగులకు వేతనాల పెంపు ఉండదని జులైలోనే తేల్చి చెప్పేసింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications