IT News: దేశంలోని ఐటీ ఉద్యోగులు సెప్టెంబర్ 2021 నుంచి అక్టోబర్ 2022 వరకు అద్భుతమైన రోజులను గడిపారు. అప్పట్లో వారి మాటే వేదవాక్కులా కంపెనీలు సైతం మిన్నకుండిపోయాయి. అవసరం మేరకు కంపెనీలు అనేక మందిని కొత్తగా నియమించుకున్నాయి.
అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం, అమెరికా మాంద్యం భాయాలతో పాటు ఇటీవల చాలా దేశాలు దివాలా తీయటం ఆర్థిక రంగాన్ని కుదేలు చేసింది. దీంతో ఐటీ కంపెనీలకు ప్రాజెక్టుల జోరు తగ్గింది. ఈ క్రమంలో టెక్ కంపెనీల నుంచి ఆఫర్ లెటర్లు అందుకున్న 2022, 2023 బ్యాచ్ ఇంజనీరింగ్ విద్యార్థులు అంతులేని ఆన్బోర్డింగ్ జాప్యాన్ని ఎదుర్కొంటున్నారు. దాదాపు ఏడాది కిందట నియామక పత్రాలు పొందినప్పటికీ.. నియమించుకున్న కంపెనీల నుంచి జాయిన్ అయ్యే తేదీ గురించి అప్డేట్ లేక ఆందోళనలో ఉన్నారు. కొన్ని కంపెనీలు ఈ గడువును పొడిగిస్తూ పోతున్నాయి.

ఈ క్రమంలో స్టాఫింగ్ సంస్థ టీమ్లీజ్ డిజిటల్ FY24లో టెక్ నియామకాల్లో 30 శాతం క్షీణతను అంచనా వేయటం ఆందోళనలు కలిగిస్తోంది. బలహీనమైన డీల్ పైప్లైన్ కారణంగా దిగ్గజ టెక్ కంపెనీలు రిక్రూట్మెంట్ తగ్గించాలని ప్లానింగ్ లో ఉండటంతో ఫ్రెషర్లను నియమించుకోవడం తగ్గించాయి. పైగా ప్రస్తుత అవసరాల కోసం తమ ఉద్యోగులను అప్స్కిల్ చేస్తూ కంపెనీలు ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. మరో పక్క ప్రాజెక్టులు లేక చాలా మంది బెంచ్ పైనే కొనసాగుతూ కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దాదాపు 25,000 మంది విద్యార్థులు తమ ఆన్బోర్డింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. కంపెనీలు ఆఫర్లను ఆలస్యం చేయటం లేదా రద్దు చేయటం సరైనది కాదని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్దాస్ పాయ్ అన్నారు. రెండు మూడు క్వార్టర్లు ఆర్థికంగా నష్టపోయినప్పటికీ.. కంపెనీలు ఫ్రెషర్లను ఆన్బోర్డ్ చేసి వారికి వెంటనే శిక్షణ ఇవ్వాలని పరిశ్రమ అనుభవజ్ఞులు అంటున్నారు. కొద్ది రోజుల్లో వృద్ధి ఖచ్చితంగా తిరిగి వస్తుందని ఇప్పుడే ఫ్రెషర్లను ఆన్బోర్డ్ చేసి వారి నమ్మకాన్ని, గౌరవాన్ని పొందడం తెలివైన నిర్ణయంగా హెచ్సిఎల్ టెక్నాలజీస్ మాజీ సీఈవో వినీత్ నాయర్ అన్నారు.
ఇదే సమయంలో ఉత్పాదకత లేకుండా ఎక్కువ జీతాలు పొందుతున్న మిడ్ లెవల్ ఉద్యోగుల భారాన్ని కంపెనీలు తగ్గించుకోవాలని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు ఉద్యోగులకు కృత్రిమ ప్రమోషన్లను మానుకోవాలని అభిప్రాయపడుతున్నారు. అలాగే ష్రెషర్లకు మంచి జీతాలను ఆఫర్ చేయాలని వారు సూచిస్తున్నారు.
More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications