TCS News: దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ వరకుసగా ఉద్యోగులకు శుభవార్తలను ప్రకటిస్తోంది. కొన్ని రోజుల కిందట నాలుగో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన కంపెనీ తాజాగా ఉద్యోగుల జీతభత్యాలపై దృష్టి సారించింది.
వివరాల్లోకి వెళితే కంపెనీలోని ఉద్యోగుల్లో జీతాల విషయంలో ఉన్న దూరాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టినట్లు ఐటీ దిగ్గజం టీసీఎస్ వెల్లడించింది. ఈ క్రమంలో ఉద్యోగుల జీతాలను రెండింతలు చేసేందుకు కార్యాచరణను రూపొందించినట్లు టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఈ చర్యల్లో భాగంగా.. ఉద్యోగులకు నైపుణ్యం పెంచుకోవడానికి, వారి జీతాలను రెట్టింపు చేసే అవకాశాలను అందించాలని కంపెనీ చూస్తున్నట్లు లక్కడ్ వెల్లడించారు. ఒక పక్క సంక్షోభంతో ఏర్పడిన వ్యాపార మందగమనం కారణంగా చాలా టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తూ పోతోంటే.. టీసీఎస్ మాత్రం ఫ్రెషర్ల నియామకం, వేతనాల పెంపు విషయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నట్లు మిలింద్ లక్కడ్ స్పష్టం చేశారు.
TCS ఫ్రెషర్లకు 44,000 జాబ్ ఆఫర్లను అందించినట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్స్ లో వెల్లడించింది. అలాగే ఫ్రెషర్లకు చేసిన అన్ని జాబ్ ఆఫర్లను తాము గౌరవిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. అలాగే జూనియర్ ఉద్యోగులందరికీ 100 శాతం వేరియబుల్ వేతనాన్ని చెల్లించాలని నిర్ణయించినట్లు టీసీఎస్ తాజాగా ప్రకటించింది. వేరియబుల్ వేతనాన్ని పూర్తిగా చెల్లించాలని కంపెనీ తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications