Q4 Results: దేశంలోని టెక్ దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్ నేడు తన నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ గత ఏడాదితో పోల్చితే స్వల్పగా అధిక లాభాలను నమోదు చేసింది.
మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో టెక్ జెయింట్ రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు ప్రకటించింది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా నమోదు చేసింది. ఇదే క్రమంలో ఏడాది ప్రాతిపదికన కంపెనీ ఆదాయం 7.1 శాతం పెరిగి రూ.28,499 కోట్లుగా నమోదైంది. ఇది మార్కెట్ అంచనాల కంటే తక్కువ కావటం గమనార్హం.

అక్టోబర్-డిసెంబర్ కాలంలో నమోదైన రూ.4,351 కోట్లతో పోలిస్తే త్రైమాసికానికి-పన్ను అనంతర లాభం 8 శాతం క్షీణతను చవిచూసింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం 5.3 శాతం పెరిగి రూ.28,499 కోట్లుగా ఉంది. టెక్ కంపెనీలు అంతర్జాతీయ సవాళ్లతో ఇబ్బందులు పడుతున్న సమయంలో కూడా అమెరికా రాబడుల వృద్ధి 5.4 శాతం పెరిగి పరిశ్రమకు నాయకత్వం వహిస్తోంది. హెచ్సీఎల్ FY24 పనితీరు పూర్తి ఏడాదికి 8.3% వృద్ధితో రూ.1,09,913 కోట్ల ఆదాయంతో వ్యాపార స్థితిస్థాపకతను నొక్కి చెబుతోంది. ఈ పరిశ్రమను EBITతో 8.4% వృద్ధితో రూ.20,027 కోట్లతో అగ్రగామిగా అందించినట్లు కంపెనీ పేర్కొంది.
2024-25 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ.2 ముఖవిలువ కలిగిన ప్రతి ఈక్విటీ షేరుపై రూ.18 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఏప్రిల్ 26న FY24కి సంబంధించిన నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ మే 7, 2024ని డివిడెండ్ చెల్లింపు కోసం రికార్డ్ డేట్గా సెట్ చేసింది. పేర్కొన్న మధ్యంతర డివిడెండ్ చెల్లింపు తేదీగా మే 15, 2024ని నిర్ణయించింది. కంపెనీ ఏఐ ఆదారిత ఉత్పత్తుల వైపు నడుస్తోందని తాము వీటిపై దృష్టి సారించామని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications