Salesforce: టెక్ కంపెనీల పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది హైదరాబాద్ నగరం. ఒకప్పుడు బెంగళూరును పెట్టుబడులకు ఎంచుకున్న కంపెనీలు ఇప్పుడు వ్యాపార అనుకూల వాతావరణంతో పాటు, స్కిల్ ఉద్యోగులు లభించటంతో కంపెనీలు తెలంగాణలో తమ విస్తరణను సాగిస్తున్నాయి.
టెక్ కంపెనీలు ప్రపంచ స్థాయిలో దూసుకుపోతున్న వేళ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ మేజర్ సేల్స్ఫోర్స్ హైదరాబాద్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని విస్తరించడం ద్వారా తన భారత వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు గురువారం ప్రకటించింది. 2016లో ప్రారంభమైన హైదరాబాద్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కంపెనీకి కీలక కేంద్రంగా మారింది. ప్రస్తుతం కంపెనీకి బెంగళూరు, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, పూణె, జైపూర్లోని కార్యాలయాల్లో 9,000 మంది ఉద్యోగులు ఉన్నారు.

దేశంలో వృద్ధి పథం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉందని, వేగంగా అభివృద్ధి చెందాలని తాము భావిస్తున్నట్లు సేల్స్ఫోర్స్ ఇండియా CEO, ఛైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. హైదరాబాద్ CoEలోని బృందాలు అన్ని పరిమాణాల సంస్థలకు అవసరమైన క్లౌడ్ పరిష్కారాలను సిద్ధం చేస్తున్నారని ఆమె వెల్లడించారు. కంపెనీ హెల్త్ క్లౌడ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ క్లౌడ్, నెట్ జీరో క్లౌడ్ ఉన్నాయని ఆమె తెలిపారు. Air India, HDFC Ltd, Tata CliQ, Mahindra Ltd వంటి ప్రముఖ భారతీయ కంపెనీలు తమ కస్టమర్లతో కనెక్ట్ కావడానికి సేల్స్ఫోర్స్ టెక్నాలజీలను ఉపయోగిస్తాయని వెల్లడించారు.
భారతదేశం గ్లోబల్ డిజిటల్ నాయకత్వాన్ని సాధిస్తున్నందున, హైదరాబాద్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ త్వరలో అనేక ప్రపంచ స్థాయి ఆవిష్కరణలకు నిలయంగా మారుతుందని అంచనా వేస్తున్నట్లు తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్ సేల్స్ఫోర్స్ వృద్ధి వ్యూహంలో అంతర్భాగంగా మారినందుకు గర్విస్తున్నామని ఆయన తెలిపారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications