HCLTech: దేశంలోని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు పండక్కి ముందే వరుస షాకులు ఇస్తున్నాయి. ఒకపక్క ఉద్యోగ నియామకాలు దాదాపు నిలిపివేసిన టెక్ కంపెనీలు మరోపక్క ఉన్న ఉద్యోగుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాయి.
దేశంలోని ప్రధాన ఐటీ సేవల కంపెనీలు ప్రస్తుతం ఆఫీస్మోడ్లోకి మైగ్రేట్ అవుతున్నాయి. గతంలో హైబ్రిడ్ అన్న కంపెనీలు ఇప్పుడు రోజూ ఆఫీసులకు రావాల్సిందేనని తేల్చి చెబుతున్నాయి. ముందుగా దేశీయ టెక్ దిగ్గజం టీసీఎస్ ఉద్యోగులను ఆఫీసులకు రావటం తప్పనిసరి చేసింది. ఆ తర్వాత అదే దారిలో ఇన్ఫోసిస్ కూడా ఉంది.

తాజాగా టాప్-5 ఐటీ కంపెనీగా ఉన్న హెచ్సీఎల్ టెక్నాలజీస్ తన ఉద్యోగులను వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయానికి వచ్చి పని చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. ఉద్యోగులు నిరంతరం ఆఫీసులకు దూరంగా ఉంటూ పనిచేయటం మంచిది కాదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈవో, MD సి విజయకుమార్ పేర్కొన్నారు. ఈ మూడు రోజులు ఎలా ఉంటాయనే దానిపై కంపెనీ ఉద్యోగులకు కొంత వెసులుబాటు కల్పిస్తోందని తెలిపారు.
ఇదే సమయంలో ప్రస్తుతం హెచ్సీఎల్ టెక్కు ఇజ్రాయెల్లో దాదాపు 130 మంది ఉద్యోగులు ఉన్నారని, వారందరూ సురక్షితంగా ఉన్నారని విజయకుమార్ చెప్పారు. తాము ఇజ్రాయెల్లో ఎలాంటి వ్యాపారం చేయటం లేదని, అయితే సాఫ్ట్వేర్ టీమ్లలో కొన్ని అక్కడ ఉన్నాయని స్పష్టం చేశారు. తాము పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అదృష్టవశాత్తూ వారంతా సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు.
కరోనా తర్వాత క్రమంగా పరిస్థితులను టెక్ కంపెనీలు తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాయి. దీంతో వారు 'వర్క్ ఫ్రమ్ హోమ్' సంస్కృతికి ముగింపు పలుకుతున్నారు. ప్రస్తుతం టీసీఎస్ తన 6.14 లక్షల మంది ఉద్యోగులను తప్పనిసరిగా ఆఫీసులకు వచ్చి పనిచేయాల్సిందిగా ప్రకటించింది. దీంతో ప్రస్తుతం 70 శాతం మంది ఆఫీసులకు రావటం మెుదలు పెట్టారని కంపెనీ ప్రరకటించింది.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications