IT News: ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీల మధ్య ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యుగం వ్యాప్తి చెందుతోంది. అయితే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు పెద్ద టెక్ కంపెనీలు రేసులో ముందు వరుసలో ఉన్నాయి. ఇది ప్రఖ్యాత యూఎస్ కంపెనీల మధ్య పెద్ద యుద్ధానికి దారితీస్తోంది.
అయితే ఈ క్రమంలో భారత్ కు చెందిన ఇద్దరు ఐఐటీ ఉద్యోగుల కోసం ఆపిల్, గూగుల్ మధ్య పెద్ద గొడవ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం.. గూగుల్లో ఇంజినీరింగ్, AI ఉత్పత్తి విస్తరణ VPగా ఉన్న వెంకటాచారి IIT మద్రాస్ నుంచి కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేశారు. అలాగే గూగుల్లో విశిష్ట ఇంజనీర్ అయిన ఆనంద్ శుక్లా ఐఐటీ కాన్పూర్ నుంచి కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేశారు.

దీనికి ముందు ఈ ఇద్దరు ఇంజనీర్లు 2022 చివరి వరకు ఆపిల్ కంపెనీలో పనిచేశారు. ఆపిల్ వీరు సిరి, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన వారు కావటం గొడవకు దారితీసింది. ఇది గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, ఆపిల్ సీఈవో టిమ్ కుక్ లకు మధ్య వివాదానికి కారణమైంది. పెద్ద-భాషా నమూనాల (LLM)పై పనిచేసేందుకు గూగుల్ లో చేరటం ఉత్తమమని ఇంజనీర్లు విశ్వసించారు.
అయితే గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఈ బృందాన్ని వ్యక్తిగతంగా ఆకర్షించారని, ఆపిల్ సీఈవో టిమ్ కుక్ ఇంజనీర్లను తమ వద్ద ఉండమని ఒప్పించేందుకు ప్రయత్నించారని కొన్ని నివేదికల ద్వారా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఇంజనీర్ల రాకతో ఆపిల్ వెనుకబడగా.. గూగుల్ మాత్రం తన ఏఐ బార్డ్ ను అందుబాటులోకి తెచ్చేందుకు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తోంది. ఇదే సమయంలో మైక్రోసాఫ్ట్ మాత్రం ఓపెన్ ఏఐ చాట్ జీపీటీలో పెట్టుబడులు పెట్టి రేసులో దూసుకుపోతోంది. అలాగే బింగ్, మైక్రోసాఫ్ ఆఫీస్ ఉత్పత్తుల్లో సైతం ఏఐని అనుసంధానించాలని చూస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications