TCS, Wipro, Infosys: టెక్ కంపెనీలు చాలా కాలం తర్వాత అటు ఉద్యోగులను, ఇటు ఇన్వెస్టర్లను పరేషాన్ చేస్తున్నాయి. ఇది మార్కెట్లలో గందరగోళానికి కారణమౌతున్నాయి.కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తర్వాత మెుదటి త్రైమాసికం పూర్తవుతోంది. వచ్చే వారం టాప్ టెక్ దిగ్గజ కంపెనీలు తమ ఫలితాలను మార్కెట్లలోకి విడుదల చేయనున్నాయి. జూన్ త్రైమాసికంలో టీసీఎస్, హెచ్సీఎల్ జూలై 12న, విప్రో జూలై 13న, LTIMindtree జూలై 17న, ఇన్ఫోసిస్ జూలై 20న తమ ఫలితాలను ప్రకటించనున్నాయి.
ఈ క్రమంలో ఐటీ రంగం క్యూ-1 ఫలితాలు మ్యూటెడ్ ఫలితాలను నమోదు చేస్తాయని మార్కెట్ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రధానంగా అమెరికా, యూరప్ మార్కెట్లలో డిమాండ్ వాతావరణం మెరుగుపడకపోవటం ఆందోళనలకు కారణంగా ఉంది. చాలా IT కంపెనీలు బలహీనమైన మాక్రోల కొనసాగింపు కారణంగా Q1 కాలానుగుణంగా బలమైన త్రైమాసికం అయినప్పటికీ మ్యూట్ చేయబడిన Q1 ఫలితాలను నివేదిస్తాయని బ్రోకరేజ్ షేర్ఖాన్ వెల్లడించింది.

గడచిన రెండు నెలలుగా ఐటీ కంపెనీలు డిమాండ్ విషయంలో ఎలాంటి మార్పులను చూడలేదని HDFC సెక్యూరిటీస్ అభిప్రాయపడింది. పరిస్థితి మెరుగుపడలేదు. ఐటీ దిగ్గజం యాక్సెంచర్ ఇటీవల ఆదాయాలపై చేసిన కామెంట్స్ కూడా అధిక విచక్షణ/కన్సల్టింగ్ విభాగాలు సాఫ్ట్ డిమాండ్ వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయని సూచిస్తుంది. ఇదే సమయంలో నిఫ్టీ IT ఇండెక్స్ వాల్యుయేషన్ కూడా 5 ఏళ్ల సగటు కంటే తక్కువకు పడిపోవటం ఇన్వెస్టర్లను ఆందోళనలకు గురిచేస్తోంది.
ఐటి సర్వీస్ కంపెనీల ప్రస్తుత అండర్ పెర్ఫార్మెన్స్ మ్యాక్రో ఓవర్ హాలింగ్ కు దారితీస్తుందని బ్రోకరేజ్ షేర్ ఖాన్ అభిప్రాయపడింది. ఇదే క్రమంలో ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, పెర్సిస్టెంట్, కోఫోర్జ్ బ్రోకరేజ్ ప్రాధాన్య ఎంపికల్లో ఉన్నాయి. అలాగే హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ ప్రొజెక్షన్ ప్రకారం టిసిఎస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ మరియు విప్రోల పన్ను తర్వాత సర్దుబాటు చేసిన లాభం 3.8 శాతం, 5.3 శాతం మరియు 10.1 శాతం QoQ తగ్గవచ్చని వెల్లడించింది. ఇదే సమయంలో ఇన్ఫోసిస్ QoQ ప్రాతిపదికన పన్ను తర్వాత సర్దుబాటు చేసిన లాభం 2.3 శాతం వృద్ధిని నమోదు చేయవచ్చని తెలిపింది.


Click it and Unblock the Notifications