TCS: గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ప్రస్తుతం దేశీయ ఐటీ కంపెనీలను అనేక సమస్యలు చుట్టుముట్టాయి. ఉద్యోగుల కొరత నుంచి భారీగా పెరిగిన వ్యయాలు, మూన్ లైటింగ్ వంటి అనేక సమస్యలు కంపెనీ యాజమాన్యాలకు నిద్రలేకుండా చేస్తున్నాయి. కరోనా కాలంలో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అందించిన దేశంలోనే మొదటి కంపెనీ.. సంక్షోభ సమయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంటోంది. TCS ఇప్పుడు తన ఉద్యోగుల జీతాల పెంపుపై సంచలన ప్రకటన చేయనుంది.

అమెరికా మందగమనం..
యూఎస్ ఆర్థిక మందగమనం ప్రభావంతో భారత్ లోని అన్ని ఐటి సంస్థలు ప్రస్తుతం లాభదాయకతపై పెద్ద ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు అనేక కొత్త వ్యూహాలను అవలంబిస్తున్నాయి. ఇందులో ముఖ్యమైన ఉద్యోగులకు ఇచ్చే వేరియబుల్ పే. అయితే వీటి చెల్లింపుల విషయంలో కంపెనీలు భారీగా కత్తెర వేస్తున్నాయి.

TCS ప్రకటన..
ఇకపై తమ ఉద్యోగులకు మొదటి సంవత్సరం జీతాల పెంపు ఉండదని టీసీఎస్ తన తాజా ప్రకటనలో వెల్లడించింది. ఏడాది పూర్తైన తర్వాతే హైక్స్, శాలరీ ఇంక్రిమెంట్స్ ఉంటాయని స్పష్టం చేసింది. దీంతో కంపెనీలో కొత్తగా చేరిన ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

TCS జీతాల పెంపుపై..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒక సంవత్సరం సర్వీస్ పూర్తి చేసిన వారికి పెంపు ఇవ్వబడదని TCS మేనేజ్మెంట్ తన ఉద్యోగులకు పంపిన ఈమెయిల్ లో వెల్లడించింది. వారికి జీతం ఇంక్రిమెంట్ వచ్చే ఏడాది మార్చిలో మాత్రమే ఉంటుందని తెలిపింది. దీంతో మార్చిలోపు ఏడాది పూర్తయిన వారికి జీతాల పెంపు ఉండదని టీసీఎస్ స్పష్టం చేసింది. TCS ఆపరేటింగ్ మార్జిన్పై ప్రభావాన్ని తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అమెరికా మాంద్యం..
అమెరికా ఆర్థిక మందగమనం కారణంగా భారతీయ ఐటీ కంపెనీలు పెద్ద నష్టాన్ని ఎదుర్కొంటాయని విశ్లేషకులు అంటున్నారు. అయితే అది అంత చెడ్డది కాకపోవచ్చునని ఆర్థిక నిపుణులు అంటున్నారు. పైగా ప్రస్తుతం డాలర్ బలపడటంతో కంపెనీలకు ఫారెక్స్ మార్పిడి సమయంలో ఎక్కువ ఆదాయాలు వస్తున్నాయి.

మితిమీరిన జీతాల ఖర్చులు..
అమెరికా ఆర్థిక మందగమనం ఐటీ రంగంలోని మితిమీరిన వేతన వ్యయాలు, ఉద్యోగుల టర్నోవర్ వంటి క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే టెక్కీలు మాత్రం ఆఫీసులకు వచ్చేందుకు విముకత చూపుతున్నారు. దీనికి మూన్ లైటింగ్ తోడు కావటంతో రెండు ఆధాయాలను వదులుకోలేకపోతున్నారు. అయితే కంపెనీలు మాత్రం ఈ ధోరణిపై చాలా సీరియస్ గా ఉన్నాయని మార్కెట్ వార్గాలు అంటున్నాయి.

కొత్త వ్యాపారం..
భారతీయ ఐటీ కంపెనీలకు అందుబాటులో ఉన్న కొత్త వ్యాపారాల సంఖ్యను తగ్గించడం వల్ల ఈ రెండూ సాధ్యమవుతాయని భావిస్తున్నారు. కొత్త వ్యాపారంలో తగ్గింపు తప్పనిసరిగా రాబడి, లాభాల మార్జిన్లను తగ్గిస్తుంది. దీనిని ఎదుర్కొనేందుకు జీతాల పెంపుదల నియంత్రణ, వేరియబుల్ వేతనాల తగ్గింపు వంచి చర్యలకు కంపెనీలు ఉపక్రమిస్తున్నాయి. విసృత అవకాశాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రాజెక్టులను కావాలనే కంపెనీలు నిర్వహించటానికి వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.
More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications