భారతదేశంలోని అతిపెద్ద సాఫ్ట్వేర్ సేవల సంస్థ Tata Consultancy Services (TCS) తన ఉద్యోగుల సంఖ్యలో సుమారు 2% తగ్గింపు చేయబోతుంది అంటే, వచ్చే ఆర్థిక సంవత్సరం 2026 (ఏప్రిల్ 2025 నుండి మార్చి 2026) మధ్యలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 12,000 మంది ఉద్యోగులు కంపెనీని నుంచి తొలగించబడతారు.

TCS CEO కె. కృథివాసన్ ఒక ప్రముఖ ఆర్థిక మాధ్యమం Moneycontrol తో ఇంటర్వ్యూలో ఈ నిర్ణయాన్ని చాలా కఠినమైనదిగా పేర్కొన్నారు. అయితే, ఇది అవసరమైన, సంస్థను భవిష్యత్తుకు మరింత సన్నద్ధం చేసుకునేందుకు తీసుకుంటున్న ఒక గొప్ప అడుగు అని చెప్పారు.
"టెక్నాలజీ రంగం చాలా వేగంగా మారుతోంది. ముఖ్యంగా AI (కృత్రిమ మేధస్సు)తో పని విధానాలు మారిపోతున్నాయి. అందువల్ల సంస్థను సహజంగానే భవిష్యత్తుకి అనుగుణంగా తయారు చేసుకోవాలి. అందుకే మేము ఉద్యోగుల మెరుగైన నైపుణ్యాలను చూసి, మళ్లీ అవకాశం ఇచ్చాము. కానీ కొంతమందికి మాత్రం తిరిగి ఉద్యోగంలో కొనసాగడం సాధ్యపడలేదు. అందువలన ఈ శాతం కట్ చేయక తప్పడంలేదు. ప్రధానంగా మధ్యస్థాయి మరియు సీనియర్ ఉద్యోగులు ఈ చర్య వల్ల ప్రభావితమవుతారు," అని ఆయన చెప్పారు.
ఎందుకు ఈ నిర్ణయం?
టెక్నాలజీ మార్పులు, ముఖ్యంగా AI వృద్ధితో, పాత నైపుణ్యాలకు ప్రాధాన్యం తగ్గింది. ఉద్యోగులను కొత్త నైపుణ్యాలకు తట్టుకొనేలా తయారుచేయడం సంస్థకి కష్టంగా మారింది. కంపెనీ లక్ష్యం మాత్రం సిబ్బందిని సమర్థంగా ఉపయోగించి, వారి పనితీరును మెరుగుపరచడం.
కానీ, కృత్రిమ మేధస్సే నేరుగా ఉద్యోగాల కోతకు కారణం కాదని స్పష్టం చేశారు. "ఈ నిర్ణయం కేవలం భవిష్యత్తు నైపుణ్యాల అవసరాన్ని కలిగి ఉంటున్న స్థితిగతులను తీర్చేందుకు తీసుకోబడింది," అని చెప్పారు.
బెంచ్ పాలసీ మార్పులు
TCS జూన్ 12, 2025 నుండి తన బెంచ్ పాలసీని కూడా తిరిగి సర్దుబాటు చేసింది. కొత్త నియమాల ప్రకారం ఉద్యోగులు సంవత్సరానికి కనీసం 225 బిల్లబుల్ రోజులు ప్రాజెక్టుల్లో ఉండాలి. ఉద్యోగి ఏడాదిలో బెంచ్ (ప్రాజెక్టు లేకుండానే ఉండే కాలం) 35 రోజులు మించి ఉండకూడదు. ఈ నియమాలు పాటించని ఉద్యోగులకు తొలగింపులు జరుగుతాయని, లేదా ఉద్యోగి తక్షణ రాజీనామా చేసి సీవరెన్స్ ప్యాకేజ్లు పొందుతారని తెలిపారు.
ఉద్యోగుల పరిస్థితి
ఒకరు 4 సంవత్సరాల అనుభవం ఉన్న ఉద్యోగి, "35 రోజులు మించి బెంచ్లో ఉంటే HRతో సమావేశం పెట్టి తక్షణమే రాజీనామా చేసుకోమని చెప్పతారు. ఒప్పుకోకపోతే కంపెనీ నేరుగా తొలగింపు చేస్తుంది, అప్పుడు సీవరెన్స్ ప్యాకేజీలు అందవు" అని చెప్పారు.
TCS తీసుకుంటున్న జాగ్రత్తలు
ప్రభావితమైన ఉద్యోగులకు నొటీస్ పీరియడ్ వేతనం, అదనపు సీవరెన్స్ ప్యాకేజ్లు అందజేస్తోంది. బీమా సదుపాయాలను పొడిగిస్తోంది. ఔట్ప్లేస్మెంట్ (ఎగ్జిట్ సమర్ధన) కార్యక్రమాలు కూడా అందిస్తోంది. ఉద్యోగులతో వ్యక్తిగతంగా సమావేశాలు పెట్టి సానుభూతితో వ్యవహరించేందుకు ప్రయత్నిస్తుంది.
AI ప్రభావంతో టెస్టింగ్ వంటి పాత నైపుణ్యాలతో పని చేసే ఉద్యోగాల అవసరం తగ్గుతోంది. క్లయింట్లు చిన్న ప్రాజెక్టులు మరియు తక్కువ సిబ్బందితో పనులను పూర్తి చేయాలని చూస్తున్నాయి. ఇది సంస్థల సామర్థ్యాన్ని పెంచడానికి దారితీస్తోంది.
"ఉద్యోగుల వలన సంస్థ మరింత బలంగా మారాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది ఉద్యోగులపై ప్రభావం చూపించ వచ్చు కానీ, ఇది సంస్థ యొక్క దీర్ఘకాలిక ప్రగతికి అవసరం." కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితి మరియు కస్టమర్ డిమాండ్ లో నిరంతర మార్పుల కారణంగా, ఈ షిఫ్టులు IT రంగంలో మరింత సాధారణమవుతాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications