TCS News: దొంగలను ఏరేస్తున్న టీసీఎస్.. తీవ్ర బాధలో ఛైర్మన్ చంద్రశేఖరన్..
TCS News: దేశంలోని అతిపెద్ద ఐటీ సేవల కంపెనీగా పేరుగాంచిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో ఉద్యోగాల స్కామ్ బయటపడింది. టాటాలు ఇలాంటి వాటిని అస్సలు క్షమించరని తెలిసిందే.
కాంట్రాక్టు ఉద్యోగుల నియామకంలో కొన్ని స్టాఫింగ్ సంస్థల నుంచి ఫేవర్లను పొందినట్లు తేలిన ఆరుగురు ఉద్యోగులను తొలగించినట్లు టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ జూన్ 29న వెల్లడించారు. అలాగే కంపెనీ మరో ముగ్గురు ఉద్యోగుల పాత్రపై దర్యాప్తు చేస్తున్నట్లు వార్షిక సాధారణ సమావేశంలో వెల్లడించారు. నైతిక ప్రవర్తనను పాటించనందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

ఇదే విషయంలో 6 స్టాఫింగ్ సంస్థలను బ్యాన్ చేసినట్లు చంద్రశేఖరన్ తెలిపారు. స్కామ్ లో పాల్గొన్నవారికి ఎలాంటి సహాయాలు లభించాయో లెక్కించలేమని.. అయితే తొలగించబడిన ఆరుగురు ఉద్యోగులు ఖచ్చితంగా కొన్ని సంస్థలకు అనుకూలంగా ప్రవర్తించినట్లు తెలిపారు. కంపెనీ బలహీనతలు ఏమిటో పరిశీలించడానికి మొత్తం BA సరఫరా నిర్వహణ ప్రక్రియను కూడా పరిశీలిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా నివారించేందుకు ప్రక్రియను పూర్తిగా చక్కదిద్దుతాయని ఆయన చెప్పారు.

టాటా గ్రూప్ ఆర్థిక పనితీరు కంటే ముందర నైతిక పరివర్తనపై దృష్టి పెడుతుందని.. ఇందులో ఉల్లంఘనలు జరిగితే అది తనకు, యాజమాన్యానికి బాధ కలిగిస్తుందని చంద్రశేఖరన్ తెలిపారు. ఇలాంటి సంఘటనలను చాలా తీవ్రంగా పరిగణిస్తామని పేర్కొన్నారు. టీసీఎస్ 28వ వార్షిక సాధారణ సమావేశంలో(AGM)లో మాట్లాడుతూ చంద్రశేఖరన్.. టీసీఎస్ ఉద్యోగులు ఇలా స్టాఫింగ్ సంస్థలకు అనుకూలంగా ప్రవర్తించడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications