భారతదేశంలో అతి పెద్ద IT కంపెనీ TCS ఇటీవల సుమారు 12,000 ఉద్యోగాలను తగ్గించడానికి ప్రకటించిన తర్వాత, పూణెలోని ఉద్యోగుల యూనియన్ NITES కంపెనీ పై 2,500 మంది ఉద్యోగులను బలవంతంగా రిజైన్ చేయించారని ఆరోపించింది. యూనియన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కి లేఖ రాస్తూ ఉద్యోగుల హక్కులను రక్షించమని అభ్యర్థించింది.
TCS ఈ ఆరోపణలను పూర్తిగా తిరస్కరించింది. కంపెనీ ఇలా తెలిపింది, ఈ చర్య కేవలం ఉద్యోగుల నైపుణ్యాలను సర్దుబాటు చేయడం కోసం మాత్రమే చేశారు మరియు అది కేవలం కొన్ని ఉద్యోగులకే ప్రభావం ఉంటుంది. ప్రభావితులైన ఉద్యోగులకు సరైన సెవెరెన్స్ ప్యాకేజీ మరియు మద్దతు ఇచ్చినట్లు కంపెనీ స్పష్టంగా తెలిపింది.

NITES అధ్యక్షుడు హర్ప్రీత్ సింగ్ సలుజా "పూణెలో గత కొన్ని వారాల్లో సుమారు 2,500 ఉద్యోగులు బలవంతంగా రిజైన్ చేయించబడ్డారని లేదా అకస్మాత్తుగా ఉద్యోగం నుండి తొలగించబడ్డారని. యూనియన్ పేర్కొన్నట్టు, TCS ఉద్యోగ విరమణ పరిహారం ఇవ్వడంలో విఫలమై, ఉద్యోగులను భయపెట్టడం ద్వారా "స్వచ్చందంగా రిజైన్ చేయించారని" ఆరోపించింది. కాగా, TCS ఇప్పటికే 2025లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 2% (12,261 ఉద్యోగాలు) తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఈ తగ్గింపు ఎక్కువగా మధ్యస్థ మరియు సీనియర్ స్థాయి ఉద్యోగుల పై ప్రభావం చూపుతుంది అని తెలిపారు.
NITES తెలిపింది ఎంటంటే, ప్రభావితులు కేవలం సంఖ్యలే కాదు, వీరు కుటుంబానికి భరోసా ఇచ్చే తల్లిదండ్రులు, భార్యలు, భర్తలు. చాలా మధ్యస్థ మరియు సీనియర్ స్థాయి ఉద్యోగులు 10-20 సంవత్సరాలు ఆ కంపెనీ కోసం కష్టపడారు. వారిలో చాలామంది 40 ఏళ్ల కంటే పైబడి, EMIs, పిల్లల స్కూల్ ఫీజులు, వైద్య ఖర్చులు, వృద్ధ తల్లిదండ్రులు బాధ్యత భరించాలి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ఉద్యోగం దొరకడం చాలా కష్టం. TCS-NITES వివాదం పూణెలో ఉద్యోగుల భద్రత, కంపెనీ విధానాలు, IT పరిశ్రమలో లే ఆఫ్ వ్యవహారాలపై దృష్టి సారిస్తోంది. ఉద్యోగుల హక్కులు, కంపెనీ విధానాల నిష్పత్తి, మరియు మధ్యస్థ-సీనియర్ ఉద్యోగుల భవిష్యత్తు అంశాలు మునుపెన్నడూ లేని విధంగా చర్చనీయాంశం అయ్యాయి.
IT కంపెనీలలో లే ఆఫ్స్ ఇప్పుడు కొత్త విషయం కాదు. TCS ఒకటే కాకుండా ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్ వంటి ఇతర పెద్ద కంపెనీలు కూడా తమ పని సరళిని సర్దుబాటు చేసుకోవడం కోసం కొంతమంది ఉద్యోగులను తగ్గిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గడం, ఆర్థిక పరిస్థితులు, మరియు వ్యయాల నియంత్రణల కారణంగా కంపెనీలు ఇలా అకస్మాత్తుగా లేఅవ్స్ ప్రకటించడం సాధారణమైంది. ఇలా లే ఆఫ్స్ వల్ల కంపెనీకి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగులకి కంపెనీ పైన నమ్మకం తగ్గి, పని ప్రేరణ కూడా పడిపోవడం సాధారణం. అలాగే, కంపెనీ కీర్తి మీద కూడా ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఇలా జరుగితే, మంచి టాలెంట్ చేరడం కష్టమవుతుంది మరియు ఉన్న ఉద్యోగులు కూడా కంపెనీలో ఎక్కువ కాలం ఉండకపోవచ్చు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications