IT News: ఆర్థిక మందగమనం వల్ల ప్రపంచమంతా లేఆఫ్స్ తో ఇబ్బంది పడుతోంది. అటువంటి సమయంలోనూ భారీగా నియామకాలను చేపట్టినట్లు దేశీయ టెక్ దిగ్గజం TCS తెలిపింది. ఈ మేరకు తన వార్షిక నివేదికలో వివరాలు వెల్లడించింది. గత రెండేళ్లలో లక్షా 50 వేల మంది క్యాంపస్ గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేసుకున్నట్లు ప్రకటించింది.
తన శ్రామికశక్తిని మెరుగుపరచుకోవడం కోసం 5-8 శాతం మంది సిబ్బందిని పెంచినట్లు TCS తెలిపింది. "గత రెండు ఏళ్లుగా సప్లై చైన్లో సవాళ్లు ఉన్నాయి. 2023 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో అవి గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. అయినా అంతకు ముందు ఆర్థిక ఏడాదిలో లక్షా పది వేల మంది, 2023 ఆర్థిక సంవత్సరంలో 44 వేల మందికి పైగా తాజా ఇంజనీర్లను ఆన్బోర్డింగ్ చేశాం. క్యాంపస్ హైరింగ్ ద్వారా రిక్రూట్ చేసిన వారికి అత్యంత డిమాండ్ ఉన్న AI సాంకేతికతలపై శిక్షణ ఇచ్చాము" అని సంస్థ మాజీ CEO మరియు MD రాజేష్ గోపీనాథన్ అన్నారు.

ఇండియాలో సగటున వార్షిక పెరుగుదల 5-8 శాతం ఉందని కంపెనీ తెలిపింది. కానీ పదోన్నతులు మరియు పరిహారం సవరణల మొత్తం పెరుగుదల 6-9 శాతం పరిధిల ఉన్నట్లు స్పష్టం చేసింది. ముఖ్యంగా సంవత్సరం ద్వితీయార్థంలో అట్రిషన్ తగ్గడం ప్రారంభించినందున నియామకాన్ని రీకాలిబ్రేట్ చేసినట్లు చెప్పింది. IT సేవలలో TCS అట్రిషన్ 20.1 శాతం. FY 2023లో నికర జోడింపు 22 వేల 600 కాగా.. మొత్తం సంఖ్య 6 లక్షల 15 వేలు.
ఇంధనం, సరఫరా గొలుసు మరియు AI కంపెనీలపై TCS ఛైర్మన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇప్పటికే ఉన్న ప్రతిభను పునరుద్ధరించడం, కొత్త టాలెంట్ ను నియమించుకోవడం, సమగ్రపరచడం మరియు పరిశోధనలో పెట్టుబడి పెట్టడం వంటివి చేయవలసి ఉంటుంది" అని ఛైర్మన్ నివేదికలో చెప్పారు. ఆయా కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ప్రతిభను వెలికితీయగలవని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications