ఉద్యోగులకు టీసీఎస్ గుడ్న్యూస్, ఆరు నెలల్లో వేతనాల పెంపు
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. కంపెనీ తాజా నిర్ణయంతో 4.7 లక్షలమంది ఉద్యోగులకు ప్రయోజనం దక్కుతుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఉద్యోగుల వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించిన మొదటి ఐటీ కంపెనీ టీసీఎస్. గత ఆరు నెలల కాలంలో ఈ కంపెనీ ఉద్యోగులకు ఇది రెండో వేతన పెంపు. గత ఏడాది అక్టోబర్ 6 శాతం నుండి 8 శాతం పెంచింది.
తాజా పెంపుతో కలిసి ఉద్యోగుల వేతనం 12 శాతం నుండి 14 శాతానికి పెరగనుంది. కంపెనీ ప్రపంచవ్యాప్త కార్యాలయాల్లోని సిబ్బందికి 2021 ఏప్రిల్ నుండి వేతనాలు పెంచుతున్నామని, ఈ కష్టకాలంలో కంపెనీని ముందుకు నడిపించేందుకు అవసరమైన వినూత్న దృక్పథాన్ని కనబరిచినందుకు గాను తమ సిబ్బందికి థ్యాంక్స్ అని, వారిపట్ల కంపెనీకి ఉన్న ధృఢమైన నిబద్ధతకు ఈ నిర్ణయమే నిదర్శనమని పేర్కొంది.
కరోనా సమయంలోను క్రితంసారి సీటీఎస్తో పాటు ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్ తమ ఉద్యోగుల వేతనాలను 2020 అక్టోబర్-2021 జనవరి మధ్యకాలంలో పెంచాయి.