భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (TCS) వచ్చేవారం తన రెండవ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించనుంది. అయితే ఈసారి ఫలితాలపై మార్కెట్ దృష్టి కేవలం ఆదాయ గణాంకాలకే పరిమితం కాదు. H-1B వీసా రుసుముల పెరుగుదల, AI ఆధారిత ఉద్యోగాల తొలగింపులు, అలాగే ప్రపంచ క్లయింట్ల ఖర్చు మందగమనం వంటి అంశాలు పెట్టుబడిదారులకు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన H-1B వీసా రుసుములను లక్ష డాలర్ల వరకు పెంచే నిర్ణయం భారత ఐటీ రంగాన్ని గట్టిగా కుదిపేసింది. ముఖ్యంగా TCS వంటి పెద్ద సంస్థలు అమెరికా క్లయింట్ల ప్రాజెక్టుల కోసం వేలాదిమంది ఇంజనీర్లను onsite లో నియమించుకుంటాయి. ఇటీవలి సంవత్సరాల్లో TCS, ఇతర ఐటీ కంపెనీలు వీసాపై ఆధారాన్ని తగ్గించుకునే వ్యూహం అనుసరించినప్పటికీ, ఈ భారీ ఖర్చు ఆపరేటింగ్ లాభాలను నేరుగా దెబ్బ తీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఒక వీసాపై ఒక్కో ఉద్యోగికి వందల డాలర్ల ఖర్చు కాకుండా, ఇప్పుడు లక్షల డాలర్ల వ్యయం చేయాల్సి రావడం వల్ల ప్రతిభతో కూడిన సరఫరా సంక్షోభం తలెత్తవచ్చు. దీని వల్ల వేతనాలు పెరగడం, టాలెంట్ మేనేజ్మెంట్ కష్టమవడం తప్పదని జెఫరీస్ నివేదిక స్పష్టం చేసింది. మరోవైపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వలన సర్వీసు రంగంలో పెద్దఎత్తున ఆటోమేషన్ జరుగుతోంది. ఈ క్రమంలో TCS తన శ్రామికశక్తిని 2 శాతం తగ్గించడానికి ముందడుగు వేసింది. AI ఆధారంగా భవిష్యత్ అవసరాలను తీర్చలేని ఉద్యోగులకు తెగతెంపుల ప్యాకేజీలు ప్రకటించింది. ఇది ఉద్యోగులకు ఆందోళన కలిగిస్తుండగా, పెట్టుబడిదారులు దీన్ని ఖర్చు నియంత్రణ చర్యగా చూస్తున్నారు.
సిటీ గ్రూప్ విశ్లేషకుల ప్రకారం.. TCS ఫలితాల తర్వాత చర్చ కేవలం ఆదాయం, లాభాలు మాత్రమే కాకుండా, కంపెనీ స్థానికీకరణ వ్యూహం, తన సిబ్బంది ప్రణాళికలు పైనే ఉంటుంది. ముఖ్యంగా అమెరికా వంటి పెద్ద మార్కెట్లలో వీసా ఆధారాన్ని తగ్గించి, స్థానిక నియామకాలను పెంచే దిశగా TCS ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
ట్రంప్ ప్రకటన తర్వాత NSE నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 7.3% క్షీణించడం ఈ రంగంపై పెట్టుబడిదారుల ఆందోళనను స్పష్టంగా తెలియజేస్తోంది. ఇప్పటికే అమెరికన్ కార్పొరేట్ క్లయింట్లు టెక్నాలజీ బడ్జెట్లను కఠినంగా నియంత్రించడం, విచక్షణా వ్యయాన్ని తగ్గించడం వలన భారత ఐటీ రంగానికి పెద్ద దెబ్బ తగిలింది. అంతేకాకుండా గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు (GCCs) అనగా పెద్ద కంపెనీల స్వంత డెలివరీ కేంద్రాలు భారత మార్కెట్ వాటాను క్రమంగా తీసుకుంటున్నాయి.
క్రిసిల్ ఇంటెలిజెన్స్ విశ్లేషకులు మాత్రం కొత్త వీసా ఖర్చులను క్లయింట్లకు బదిలీ చేసే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అలా చేస్తే మార్జిన్ ప్రభావం కేవలం 10-20 బేసిస్ పాయింట్లకు పరిమితం అవుతుందని భావిస్తున్నారు. అయినప్పటికీ, మొత్తం రంగం పరంగా చూస్తే ఈ అనిశ్చితి కొనసాగుతుందని, వచ్చే త్రైమాసికాల్లో ఆదాయ వృద్ధి కేవలం 4 శాతం నుండి 13 శాతం మధ్య తగ్గవచ్చని హెచ్చరిస్తున్నారు.
అందుకే ఈసారి టీసీఎస్ ఫలితాలు కేవలం లాభనష్టాల కంటే ఎక్కువగా చూస్తున్నారు. పెట్టుబడిదారులు కంపెనీ AI యుగంలో తన workforce ను ఎలా మలుచుకుంటుంది?, ట్రంప్ వీసా నిర్ణయాల ప్రభావాన్ని ఎంతవరకు సమర్థంగా ఎదుర్కొంటుంది? అన్న ప్రశ్నలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నారు. టీసీఎస్ సమాధానాలు వచ్చే నెలల్లో మొత్తం భారత ఐటీ రంగానికి టోన్ సెట్ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications