IT News: ప్రపంచవ్యాప్త ప్రఖ్యాతిగాంచిన ఇండియన్ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్.. ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ కార్యాలయాలకు తిరిగిరావాలని ఇటీవల హుకుం జారీచేసింది. దీంతో ఇదే రంగంలోని ఇతర ప్లేయర్స్ కూడా అలర్ట్ అయ్యి, TCS బాటలోనే నడవాలని ప్రయత్నించాయి. కానీ సిబ్బంది నుంచి ఎదురవుతున్న ప్రతిఘటనను ఎదుర్కోలేక కొంత వెసులుబాటు ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ TCS మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టు విడవడం లేదు.
ఇదే విషయంపై టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) చీఫ్ HR ఆఫీసర్ మిలింద్ లక్కడ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 'వేరియబుల్ పే'ను ఉద్యోగుల హాజరుకు అనుసంధానించే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడం సత్ఫలితాలను ఇచ్చినట్లు చెప్పారు. దాదాపు 70 శాతం సిబ్బంది తిరిగి విధుల్లోకి చేరారని తెలిపారు. అయితే ఇప్పటికీ దీన్ని తాత్కాలిక చర్యగానే చూస్తున్నట్లు వెల్లడించారు. కాగా ప్రతివారం ఈ సంఖ్య పెరుగుతూ వస్తుండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తిరిగి ఆఫీసులకు వచ్చే ఆవశ్యకతను ఉద్యోగులు అర్థం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

ఉద్యోగులకు చెల్లించే త్రైమాసిక వేరియబుల్ పేను TCS ఏప్రిల్ 2024లో వారి కార్యాలయ హాజరుతో జతపరిచింది. 60 శాతం కంటే తక్కువ హాజరు ఉన్నవారు సదరు బోనస్కు అర్హులు కాదని నిబంధన విధించింది. సిబ్బంది తప్పనిసరిగా వారానికి 5 రోజులు ఆఫీసు నుంచి పని చేయాలని గతంలో ఆదేశించింది. ఇది జరిగిన కొన్ని నెలల తర్వాత ఈ పాలసీని అప్డేట్ చేసి అటెండెన్స్ లింక్ చేసింది.
కాగా కొత్త విధానం ప్రకారం ఉద్యోగులు పూర్తి త్రైమాసిక వేరియబుల్ పే పొందేందుకు అర్హత సాధించాలంటే కార్యాలయంలో కనీసం 85 శాతం హాజరు ఉండాలి.
75-85 శాతం మేర కార్యాలయ హాజరు ఉన్న సిబ్బంది వేరియబుల్ పేలో 75 శాతం పొందుతారు. 60-75 శాతం రేంజ్లో ఉంటే కేవలం 50 శాతానికి మాత్రమే అర్హత లభిస్తుంది. అయితే దీన్ని కంటిన్యూగా పాటించడంలో విఫలమైతే మాత్రం TCS సదరు ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications