TCS News: ఇటీవల రెండవ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన తర్వాత దేశీయ టెక్ దిగ్గజం మరో తీపికబురు చెప్పింది. హెచ్సీఎల్ మాదిరిగానే కొత్తగా ఫ్రెషర్లను భారీగా రిక్రూట్ చేసుకోవాలని నిర్ణయించినట్లు ప్రకటించింది.
ప్రతికూల వ్యాపార పరిస్థితుల్లో వెలుగు దివ్వెగా టీసీఎస్ మారింది. అతిపెద్ద నిర్ణయంతో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఫ్రెషర్లకు శుభవార్త అందించింది. ప్రపంచ ఆర్థిక మాంద్యం కారణంగా వేలాది మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోతున్న తరుణంలో కొత్త నియామకాలు చేపడతామంటూ సంచలన ప్రకటన చేసింది. 2024 ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది ఉద్యోగులను నియమించుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొంది.

దీనిలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యాంపస్ ప్లేస్మెంట్ నియామకాల రూపంలో 40 వేల మంది టెక్ ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకోవాలని కంపెనీ యోచిస్తోందని టీసీఎస్ సీఈవో ఎన్ గణపతి సుబ్రమణియన్ తెలిపారు. ఈ ఏడాది క్యాంపస్ రిక్రూట్మెంట్కు వెళ్లే ఆలోచనలో తాము లేమంటూ గతవారం టాప్ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే గత ఏడాది ఇన్ఫోసిస్ దాదాపు 50,000 మందిని నియమించుకున్నట్లు CFO నిలంజన్ రాయ్ ఇటీవలే వెల్లడించారు. వారికి అందించిన ఆఫర్ లెటర్లను తప్పకుండా గౌరవిస్తామని తెలిపింది.
గడచిన 12-14 నెలలుగా కంపెనీ వ్యాపారంలో భారీ క్షీణతను చూసిందని ఎన్ గణపతి సుబ్రమణ్యం అన్నారు. అయితే ఇది ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేమని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 11న కంపెనీ ప్రకటించిన రెండవ త్రైమాసిక ఫలితాల్లో నికర లాభం దాదాపు 9% పెరిగి రూ.11,342 కోట్లకు చేరుకుందని కంపెనీ తెలిపింది. సవాలుతో కూడిన వ్యాపార వాతావరణంలో కొత్త డీల్స్ పొందటం లాభదాయకతను పెంచడంలో సహాయపడిందని కంపెనీ తెలిపింది. ఈ క్రమంలోనే ఒక్కో షేరుపై రూ.9 ఇంటెరిమ్ డివిడెండ్ ప్రకటించింది.
More From GoodReturns

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

ఇరాన్ వార్ దెబ్బకు వణుకుతున్న భారత ఐటీ సెక్టార్.. తీవ్ర ప్రమాదంలో కీలక ప్రాజెక్టులు..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications