భారతదేశ ఐటీ రంగం గత రెండు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వృద్ధిని సాధించింది. కంపెనీల ఆదాయం కోట్లకు చేరింది. గ్లోబల్ మార్కెట్లో భారత్ ఐటీ హబ్గా నిలిచింది. కానీ, ఒక విషయంలో మాత్రం కాలం వెనక్కే ఆగిపోయిందా అన్న అనుమానం కలుగుతోంది. అదే ఐటీ ఫ్రెషర్ల ప్రారంభ జీతం (Entry-level salary). 2004లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కు ఎంత జీతం ఇచ్చేవారో.. 2026లో కూడా దాదాపు అదే స్థాయిలో ఆఫర్ చేస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

2004 వర్సెస్ 2026: అప్పుడు ఓకే.. ఇప్పుడు కష్టమే!
2004-2005 కాలంలో టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys) వంటి దిగ్గజ కంపెనీలలో చేరిన ఫ్రెషర్లకు ఏడాదికి రూ. 2.8 లక్షల నుండి రూ. 3.1 లక్షల వరకు ప్యాకేజీ లభించేది. ఆ సమయంలో జీవన వ్యయం తక్కువగా ఉండటంతో ఆ జీతం గౌరవప్రదంగా ఉండేది. కానీ, సరిగ్గా రెండు దశాబ్దాల తర్వాత కూడా చాలా పెద్ద ఐటీ సంస్థలు ఫ్రెషర్లకు అదే రూ. 3 లక్షల నుండి రూ. 3.5 లక్షల లోపు ప్యాకేజీనే ఆఫర్ చేస్తున్నాయి.
జీతాలు పెరగకపోవడానికి కారణాలు ఏంటి?
ఐటీ రంగ నిపుణుల విశ్లేషణ ప్రకారం దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి..
- గ్రాడ్యుయేట్ ఓవర్సప్లై: భారతదేశం ప్రతి ఏటా సుమారు 15 లక్షల మందికి పైగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ఉత్పత్తి చేస్తోంది. డిమాండ్ కంటే సప్లై ఎక్కువగా ఉండటం వల్ల కంపెనీలు జీతాలను పెంచాల్సిన అవసరం లేకుండా పోతోంది.
- నైపుణ్యాల కొరత: లక్షల మంది పట్టా పొందుతున్నా, కంపెనీలకు కావాల్సిన వెంటనే పని చేయగలిగే నైపుణ్యాలు (Deployable skills) ఉన్నవారు తక్కువగా ఉంటున్నారు. దీనివల్ల కంపెనీలు ఫ్రెషర్లను కేవలం 'ట్రైనీలు'గానే పరిగణించి తక్కువ జీతాలు ఇస్తున్నాయి.
పెరిగిన ఖర్చులు.. తగ్గిన కొనుగోలు శక్తి
నామమాత్రంగా జీతం రూ. 3 లక్షలుగా ఉన్నప్పటికీ.. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో దాని విలువ చాలా తగ్గిపోయింది. బెంగళూరు, హైదరాబాద్, పూణే వంటి నగరాల్లో ఇంటి అద్దెలు, రవాణా ఖర్చులు, ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 2004లో రూ. 3 లక్షల జీతంతో సాఫీగా సాగిపోయే జీవితం నేటి కాలంలో కేవలం మనుగడ సాగించడానికే సరిపోతోందని ఫ్రెషర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నైపుణ్యం ఉంటేనే అధిక ప్యాకేజీ!
అయితే అందరికీ జీతాలు తక్కువగా ఉన్నాయని చెప్పలేం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML), క్లౌడ్ కంప్యూటింగ్ , సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక సాంకేతికతలలో నైపుణ్యం ఉన్న ఫ్రెషర్లు ఇప్పటికీ రూ. 6 లక్షల నుండి రూ. 12 లక్షల ప్యాకేజీలను అందుకుంటున్నారు. జెనరేటివ్ AI వంటి విభాగాల్లో నిపుణులైతే ఏకంగా రూ. 22 లక్షల కంటే ఎక్కువ జీతం పొందుతున్నారు. అంటే కేవలం డిగ్రీ ఉండటం కంటే డిమాండ్ ఉన్న నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారానే ఐటీ రంగంలో మంచి జీతం (salary) సాధించడం సాధ్యమవుతుంది.
మొత్తంగా చెప్పాలంటే సాంప్రదాయ ఐటీ సర్వీసెస్ మోడల్ ఇప్పుడు ఒత్తిడికి లోనవుతోంది. పెరిగిన ఖర్చులు, మారుతున్న టెక్నాలజీ నేపథ్యంలో కంపెనీలు తమ శాలరీ స్ట్రక్చర్ను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ప్రతిభావంతులైన యువత ఈ రంగం నుండి తప్పుకునే ప్రమాదం ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications