రైల్వే ప్రయాణికులకు షాక్.. నిమిషాల్లోనే ఖాళీ అవుతున్న తత్కాల్ సీట్లు..పండగ వేళ తీవ్ర ఆందోళన..

Tatkal Ticket Booking: దేశంలో దీపావళి, ఛత్ పూజల పండుగ సీజన్ సమీపిస్తుండటంతో స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు, బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లు రద్దీగా మారాయి. పండుగలకు ఇంకా కొన్ని వారాల సమయం ఉన్నప్పటికీ, ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటున్న ప్రయాణికులకు కన్ఫర్మ్డ్ రైలు టిక్కెట్టు పొందడం కష్టరతంగా మారింది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా వంటి ప్రధాన నగరాల నుండి ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ వైపు వెళ్లే మార్గాల్లో రైళ్లకు అనూహ్య డిమాండ్ ఏర్పడింది.

సాధారణ రిజర్వేషన్ టిక్కెట్లు నిమిషాల వ్యవధిలోనే అమ్ముడైపోతుండటంతో ప్రయాణికులు తత్కాల్, ప్రీమియం తత్కాల్ లేదా ప్రత్యేక రైళ్లపై ఆధారపడుతున్నారు. అయితే బుకింగ్ సమయంలో ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్, బీటా ప్లాట్‌ఫారమ్, రైల్‌వన్ యాప్‌లలో ఎదురవుతున్న తీవ్ర సాంకేతిక లోపాలు, సర్వర్ మందగించడం, లాగిన్ వైఫల్యాలు, చెల్లింపు సమస్యలు ప్రయాణికులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయి. సీట్లు అందుబాటులో ఉన్నట్లు చూపించినప్పటికీ.. సాంకేతిక సమస్యల వల్ల బుకింగ్ పూర్తి కాకపోవడంతో చేతివరకు వచ్చిన టిక్కెట్లు చేజారిపోతున్నాయి.

Tatkal Ticket Booking Tatkal Tickets IRCTC Tatkal Indian Railways Railway Ticket Booking Tatkal Booking News Tatkal Tickets Sold Out Tatkal Ticket Availability train ticket booking railway passengers Tatkal booking rush train ticket demand IRCTC booking Tatkal seats Indian Railways Tatkal Tatkal Ticket Booking Tatkal Tickets Railway Ticket Booking IRCTC Indian Railways sold out

రోజూ ఉదయం ఏసీ తరగతులకు 10 గంటలకు, నాన్-ఏసీ లేదా స్లీపర్ తరగతులకు 11 గంటలకు తత్కాల్ బుకింగ్‌లు ప్రారంభమవుతాయి. ప్రయాణానికి ఒక రోజు ముందు మాత్రమే అందుబాటులోకి వచ్చే ఈ పరిమిత సీట్ల కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులు ఒకేసారి వెబ్‌సైట్ పైకి రావడం వల్ల డిజిటల్ మౌలిక సదుపాయాలపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఈ కీలకమైన నిమిషాల్లో ఏదైనా సాంకేతిక లోపం ఎదురైతే.. సమస్య పరిష్కారమయ్యే లోపే అందుబాటులో ఉన్న సీట్లన్నీ ఖాళీ అయిపోతున్నాయి. సాధారణ టిక్కెట్లు దొరకని వలస కార్మికులు, ఉద్యోగులు తత్కాల్ వైపు మొగ్గు చూపడం వల్ల ఈ విండో వద్ద డిమాండ్ ఊహించని రీతిలో పెరుగుతోందని రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఈ ఆన్‌లైన్ క్రమబద్ధీకరణ, పారదర్శకత కోసం రైల్వే శాఖ కీలక మార్గదర్శకాలను అమలు చేస్తోంది. దీనిలో భాగంగా తత్కాల్, ప్రీమియం తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రయాణికులు తప్పనిసరిగా తమ ఐఆర్‌సిటిసి ఖాతాను ఆధార్‌తో అనుసంధానించి, ఓటీపీ ఆధారిత ధృవీకరణను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆధార్ ధృవీకరణ లేని ఖాతాల నుండి తత్కాల్ బుకింగ్‌లు సాధ్యపడవు. అలాగే సామాన్య ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఆథరైజ్డ్ ఏజెంట్లపై రైల్వే ఆంక్షలు విధించింది.

ఉదయం 10:00 నుండి 10:30 వరకు ఏసీ తత్కాల్, ఉదయం 11:00 నుండి 11:30 వరకు నాన్-ఏసీ తత్కాల్ బుకింగ్ ప్రారంభంలో మొదటి అర్ధగంట పాటు ఏజెంట్లు టిక్కెట్లు బుక్ చేయకుండా నిషేధం అమలులో ఉంది. అయినప్పటికీ డిమాండ్ కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ఐఆర్‌సిటిసి ఖాతాలో ఆధార్ ధృవీకరణను ముందే పూర్తి చేసుకోవాలని, ప్రయాణికుల వివరాలు, డిజిటల్ చెల్లింపుల సమాచారాన్ని సిద్ధంగా ఉంచుకుని వేగంగా బుకింగ్ చేసుకోవాలని నిపుణులు ప్రయాణికులకు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+