టాటా ట్రస్ట్స్‌లో అసలేం జరుగుతోంది.. భారత కార్పొరేట్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఆ గొడవకు కారణం ఏంటి..

భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన, విశ్వసనీయమైన, విలువైన సమ్మేళన సంస్థ అయిన టాటా గ్రూప్ ప్రస్తుతం అరుదైన నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రతన్ టాటా మరణానంతరం టాటా సన్స్‌లో 66 శాతం వాటాను నియంత్రించే టాటా ట్రస్ట్స్ ‌లో ఆంతర్యుద్ధం ప్రారంభమైంది. ఈ వివాదం కేవలం వ్యక్తుల మధ్య ఘర్షణ కాకుండా ఇది దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే పరిపాలన, పారదర్శకత, వారసత్వంపై ఉన్న మౌలిక ప్రశ్నలను లేవనెత్తుతోంది.

టాటా గ్రూప్ 180 బిలియన్ డాలర్ల విలువైన సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలో 30 లిస్టెడ్ కంపెనీలు, 400కు పైగా అనుబంధ సంస్థలతో ఇది భారత ఆర్థిక వ్యవస్థలో ప్రతి రంగాన్ని తాకుతుంది. ఇలాంటి పరిస్థితిలో టాటా ట్రస్ట్స్‌లో చెలరేగిన ఈ పోరు పెద్ద ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘర్షణకు కేంద్రబిందువుగా ఉన్న రెండు వర్గాలు అయిన టాటా ట్రస్ట్స్ ట్రస్టీలు అని చెప్పుకోవచ్చు. ఒకవైపు, 2024 అక్టోబర్‌లో రతన్ టాటా మరణం తర్వాత ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన నోయెల్ టాటా.. మరోవైపు మాజీ టాటా చైర్మన్ సైరస్ మిస్త్రీ కుటుంబానికి సమీప బంధువైన మెహ్లీ మిస్త్రీ నేతృత్వంలోని వర్గం ఉంది. వీరిద్దరి మధ్య అధికార సమతుల్యత కోసం పోరు నడుస్తోంది.

Tata Trusts Noel Tata Ratan Tata Mehli Mistry Tata Group leadership crisis Tata Trusts power struggle Tata Sons N Chandrasekaran corporate governance India Tata Trusts news Tata Group succession battle Noel Tata chairman Ratan Tata legacy Tata Trusts government intervention Tata Group controversy Indian business news Tata leadership conflict philanthropy India Tata Sons shareholding Tata Trusts internal dispute

Tata Trusts వివాదానికి ఆజ్యం సెప్టెంబర్ 11న చోటు చేసుకుంది. 77 ఏళ్ల మాజీ రక్షణ కార్యదర్శి విజయ్ సింగ్ ను తిరిగి బోర్డులో నియమించాలనే ప్రతిపాదనపై ట్రస్టీలు విడిపోయారు. నోయెల్ టాటా, వేణు శ్రీనివాసన్ మద్దతు ఇచ్చినప్పటికీ.. దీనిని మిస్త్రీ వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. తీర్మానం తిరస్కరించడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. తరువాత, మిస్త్రీ వర్గం మెహ్లీ మిస్త్రీని టాటా సన్స్ బోర్డులోకి నామినేట్ చేయడానికి ప్రయత్నించగా.. నోయెల్ టాటా దానిని అడ్డుకున్నారు. దీనితో సింగ్ రాజీనామా చేశారు. ఈ పరిణామాలతో బోర్డు భవిష్యత్ నిర్ణయాలు అనిశ్చితిలోకి వెళ్లాయి.

ఈ అంతర్గత పోరు వ్యక్తిగత స్థాయిలో ఉన్న ఘర్షణ మాత్రమే కాదు. ఇది టాటా సామ్రాజ్యంలో అధికార కేంద్రీకరణ, వారసత్వ నియంత్రణ, గవర్నెన్స్ నైతికత గురించి గంభీరమైన చర్చకు దారితీసింది. ప్రభుత్వం కూడా ఈ పరిస్థితిని గమనిస్తోంది. అక్టోబర్ 7న నోయెల్ టాటా, టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, వేణు శ్రీనివాసన్, డారియస్ ఖంబాటా కలిసి హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లను కలవడం దీని తీవ్రతను సూచిస్తోంది.

అంతేకాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా ఈ పరిణామాలను దగ్గరగా పరిశీలిస్తోంది. టాటా సన్స్ తన కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ (CIC) రిజిస్ట్రేషన్‌ను స్వచ్ఛందంగా రద్దు చేసుకోవాలన్న అభ్యర్థనపై RBI ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ నియంత్రణ సమస్యలు కూడా ట్రస్ట్స్‌లోని ఆందోళనలను మరింత పెంచుతున్నాయి. ఇప్పుడు దృష్టంతా అక్టోబర్ 10న జరగనున్న టాటా ట్రస్ట్స్ బోర్డు సమావేశంపై ఉంది. వాటాదారులు, నియంత్రణ సంస్థలు, విధాన నిర్ణేతలు అందరూ ఈ సమావేశం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. టాటా సామ్రాజ్య భవిష్యత్తు, భారత కార్పొరేట్ గవర్నెన్స్ వ్యవస్థలో స్థిరత్వం.. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉండనుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+