Tata Motors: టాటా మోటార్స్ కీలక ప్రకటన.. EVలు సహా ప్యాసింజర్ వాహనాలపై..

Tata News: ప్యాసింజర్ సహా కమర్షియల్ వాహనాల సెగ్మెంట్‌లో టాటా మోటార్స్ దిగ్గజ తయారీదారుగా వెలుగొందుతోంది. అత్యంత క్వాలిటీతో కూడిన వెహికల్స్‌ను రిలీజ్ చేస్తూ, వాహనదారుల ఆదరాభిమానాలు చూరగొంది. అయితే తాజాగా వినియోగదారులకు ఓ బ్యాడ్ న్యూస్ చెప్పింది.

ఎలక్ట్రిక్ వాహనాలు (EV) సహా తమ ప్యాసింజర్ వాహనాల ధరలను 0.7 శాతం పెంచనున్నట్లు ఆటోమేకర్ టాటా మోటార్స్ ప్రకటించింది. ఇన్‌పుట్ ఖర్చుల పెరుగుదలను పాక్షికంగా భర్తీ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ధరల పెరుగుదల ఫిబ్రవరి 1, 2024 నుంచి అమలులోకి వస్తుందని పేర్కొంది.

Tata Motors hikes its passenger vehicle prices from February 1, 2024

Q3FY24లో తన మొత్తం గ్లోబల్ హోల్‌సేల్స్ 9 శాతం పెరిగి 3 లక్షల 38 వేల 177 యూనిట్లకు చేరుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. వాణిజ్య వాహనాలు మరియు టాటా దేవూ శ్రేణి 98 వేల 679 యూనిట్ల సేల్స్ నమోదు చేసినట్లు తెలిపింది. ఇది సంవత్సరానికి 1 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు వివరించింది.

ఇక ప్యాసింజర్ వాహనాల విభాగంలోనూ టాటా మోటార్స్ అదరగొట్టింది. Q3FY24లో గ్లోబల్ హోల్‌సేల్స్ ఏడాదికి 5 శాతం వృద్ధితో లక్షా 38 వేల 455 యూనిట్లకు చేరుకున్నాయి. మారుతీ సుజుకి ఇండియా కూడా కార్ల ధరలను పెంచుతున్నట్లు ఇటీవల ప్రకటించింది. ద్రవ్యోల్బణం మరియు కమోడిటీస్ ధరల కారణంగా పెరిగిన ఖర్చులు.. రేట్ల పెరుగుదలకు కారణమని పేర్కొంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+