Tata Group: మెగా బ్యాటరీ ప్లాంట్ ఏర్పాటుకు టాటా గ్రూప్ నిర్ణయం.. 4000 ఉద్యోగాలు..
Tata Group: భారత పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారంలో చాలా చురుకుగా పెట్టుబడులను కొనసాగిస్తోంది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ భవిష్యత్ అవసరాల దృష్యా టాటాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
టాటా గ్రూప్ యూకేలో బ్యాటరీ ప్లాంట్ ఏర్పాటుకు జీరో-ఇన్ చేసింది. ఇది రేంజ్ రోవర్, డిఫెండర్, డిస్కవరీ, జాగ్వార్ బ్రాండ్లతో సహా JLR భవిష్యత్తు బ్యాటరీ ఎలక్ట్రిక్ మోడళ్ల ఉత్పత్తికి దోహదపడనుంది. ఇందుకోసం కంపెనీ ఏకంగా 5.2 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించింది. టాటా గ్రూప్ పెట్టుబడిపై బ్రిటన్ ప్రధాని రిషి సునక్ సైతం హర్షం వ్యక్తం చేశారు.

జీరో ఎమిషన్ వెహికల్స్ వైపు ప్రపంచం అడుగులు వేస్తున్న తరుణంలో.. బ్యాటరీ సాంకేతికత చాలా కీలకంగా మారనుందని సునక్ అభిప్రాయపడ్డారు. ఈ బ్యాటరీ ఫ్యాక్టరీ దాదాపు 4,000 ఉద్యోగాలను సృష్టిస్తుందని తెలుస్తోంది. దీనికి తోడు సరఫరా గొలుసులో మరిన్ని ఉద్యోగాలు సృష్టించబడతాయని ఆయన పేర్కొన్నారు. టాటా గ్రూప్ తన కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం యూకే మాత్రమే కాక స్పెయిన్ను కూడా పరిశీలిస్తోంది. వ్యూహాత్మక పెట్టుబడులతో టాటా గ్రూప్ UK పట్ల తన నిబద్ధతను మరింత బలోపేతం చేసిందని చంద్రశేఖరన్ పేర్కొన్నారు.
బ్రిటన్ స్థానికంగా ఎలక్ట్రిక్ వెహికల్(EV) బ్యాటరీ సామర్థ్యాన్ని నిర్మించడానికి ప్రపంచ రేసులో చేరేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో అక్కడ ఫ్యాక్టరీల సమీపంలో భారీ బ్యాటరీల తయారీ ఆటోమేకర్లకు కీలకం కానున్నాయి. దీర్ఘకాలంలో ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమకు మద్దతు ఇవ్వడానికి, యూకేకు అవసరమైన బ్యాటరీ తయారీ సామర్థ్యాన్ని పెంచడానికి టాటాల తాజా పెట్టుబడి కీలకం.


Click it and Unblock the Notifications