చంద్రశేఖరన్ రాజీనామా.. టాటా గ్రూప్ కొత్త వారసుడిని వణికిస్తున్న ఎన్నో సవాళ్లు.. ముఖ్యంగా ఆ ఒక్కటే..

టాటా గ్రూప్ ప్రాథమిక హోల్డింగ్ సంస్థ అయిన టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి నటరాజన్ చంద్రశేఖరన్ తప్పుకుంటున్నట్లు వెలువడిన ప్రకటన కార్పొరేట్ రంగాన్ని తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. సైరస్ మిస్త్రీ తొలగింపు తర్వాత.. క్లిష్ట పరిస్థితుల్లో ఫిబ్రవరి 2017లో బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖరన్.. తన దాదాపు తొమ్మిదేళ్ల పదవీకాలంలో టాటా గ్రూప్‌ను మునుపెన్నడూ లేని రీతిలో విస్తరించారు. ఆయన నాయకత్వంలో గ్రూప్ సంపాదించిన నమ్మకం, సాధించిన ఆర్థిక ప్రగతి ఒకవైపు కొనియాడబడుతుంటే.. ఆయన వారసుడికి మిగిల్చిన కొన్ని అసంపూర్తి సవాళ్లు మరోవైపు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Chandrasekaran పదవీకాలాన్ని విశ్లేషిస్తే అతిపెద్ద విజయం వ్యాపార పరిమాణంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన బాధ్యతలు చేపట్టిన సమయానికి 2017 ఆర్థిక సంవత్సరంలో టాటా గ్రూప్ మొత్తం రాబడి లేదా టాప్‌లైన్ సుమారు రూ. 6 లక్షల కోట్లుగా ఉండేది. తొమ్మిదేళ్ల ఆయన సుదీర్ఘ ప్రయాణంలో ఈ టర్నోవర్ వార్షికంగా 11.8 శాతం సమ్మేళన వృద్ధి రేటుతో (CAGR) పెరిగి ప్రస్తుతం రూ. 16.24 లక్షల కోట్లకు చేరింది. అంటే దాదాపు రెండున్నర రెట్లకు పైగా వ్యాపార విస్తరణ జరిగింది.

Tata Group N Chandrasekaran N Chandrasekaran Tata Group Tata Group Turnover 16 24 Lakh Crore Tata Group Growth Tata Group Challenges Tata Sons Tata Group Future Tata Group Companies Ratan Tata Tata Group Leadership Tata Group Revenue N 9 16 24

N. Chandrasekaran ( Photo- PTI)

కేవలం ఆదాయం పెరగడమే కాకుండా.. కంపెనీల లాభదాయకతను పెంచడంలో చంద్రశేఖరన్ మరింత అద్భుతమైన ప్రతిభ చూపారు. నిర్వహణ ఖర్చులు, పన్నులు పోను మిగిలే నికర లాభం 2017 ఆర్థిక సంవత్సరంలో రూ. 34,909 కోట్లుగా ఉండగా, 2026 ఆర్థిక సంవత్సరం నాటికి అది ఏకంగా రూ. 1.7 లక్షల కోట్లకు చేరింది. లాభాల వృద్ధి రేటు 19.2 శాతం సంయుక్త వార్షిక రేటును నమోదు చేయడం ద్వారా రాబడి కంటే లాభాలు ఐదు రెట్లు వేగంగా పెరిగాయని ఆర్థిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వ్యాపారాల పరంగానే కాకుండా, ప్రజల దృష్టిలో టాటా బ్రాండ్‌పై నమ్మకాన్ని కొలిచే నెట్ ప్రమోటర్ స్కోర్ 2023లో మైనస్ 35గా ఉండగా.. జూన్ 2026 నాటికి అది ప్లస్ 42కి పెరగడం ఆయన పాలనా సామర్థ్యానికి నిదర్శనం.

Also Read

అయితే తదుపరి రాబోయే ఛైర్మన్‌కు చంద్రశేఖరన్ కేవలం లాభదాయకమైన వ్యాపారాన్ని మాత్రమే కాకుండా కొన్ని తీవ్రమైన ఆర్థిక సవాళ్లను కూడా అప్పగిస్తున్నారు. ఆయన తీసుకున్న అతిపెద్ద నిర్ణయాలలో ఒకటైన ఎయిర్ ఇండియా కొనుగోలు ప్రస్తుతం గ్రూప్‌కు మింగుడుపడని సవాలుగా మారింది. జూన్ 2022లో రూ. 18 వేల కోట్లకు సొంతం చేసుకున్న ఈ విమానయాన సంస్థ, అంతర్జాతీయ యుద్ధాలు, పెరిగిన ఇంధన ధరలు, ఇటీవల సంభవించిన ఏఐ171 విమాన ప్రమాదం వంటి కారణాలతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ వెల్లడించిన గణాంకాల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎయిర్ ఇండియా నికర నష్టం గతేడాది కంటే రెట్టింపై రూ. 22,238 కోట్లకు చేరింది. దీనికితోడు చంద్రశేఖరన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టాటా డిజిటల్ వ్యాపారం కూడా అదే ఆర్థిక సంవత్సరంలో రూ. 4,974 కోట్ల భారీ నికర నష్టాన్ని నివేదించింది.

మరో ప్రధాన అంశం టాటా సన్స్ స్టాక్ మార్కెట్ లిస్టింగ్ వ్యవహారం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాటా సన్స్‌ను అత్యంత కఠిన నిబంధనలు వర్తించే 'అప్పర్-టైర్ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ'గా (NBFC) వర్గీకరించింది. ఈ నిబంధనల ప్రకారం టాటా సన్స్ తప్పనిసరిగా స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ కావాల్సి ఉంది. అయితే ప్రైవేట్ సంస్థగానే కొనసాగేందుకు టాటా సన్స్ ఎన్‌బీఎఫ్‌సీ హోదా నుంచి డీ-రిజిస్ట్రేషన్ కోసం ఆర్‌బీఐకి దరఖాస్తు చేసుకోగా.. ఆ దరఖాస్తు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. టాటా సన్స్ మార్కెట్‌లోకి వస్తుందా లేదా అన్నదానిపై తదుపరి ఛైర్మన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

మొత్తంగా చూసినట్లయితే ఎన్. చంద్రశేఖరన్ తన తొమ్మిదేళ్ల పాలనలో టాటా గ్రూప్‌ను అత్యంత లాభదాయకమైన దిగ్గజ సంస్థగా తీర్చిదిద్దినప్పటికీ.. ఎయిర్ ఇండియా నష్టాలను భరించడం, డిజిటల్ వ్యాపారాన్ని లాభాల్లోకి తేవడం, ఆర్‌బీఐ లిస్టింగ్ నిబంధనలను అధిగమించడం వంటి క్లిష్టమైన బాధ్యతలు ఇప్పుడు కొత్త ఛైర్మన్ ముందు వేచి చూస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+