ముంబై: ఈ మధ్యకాలంలో కార్పొరేట్ సెక్టార్స్లో టేకోవర్ల పర్వం నడుస్తోంది. ప్రత్యేకించి- దేశీయ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్- ఇతర కంపెనీల్లో వాటాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం, వాటిల్లో పెట్టుబడులు పెట్టడం, వీలైతే వాటిని పూర్తిగా తన గ్రూప్ ఆఫ్ కంపెనీల్లోకి చేర్చడం వంటి కార్యకలాపాలపై దృష్టి సారించింది. రిటైల్ బిజినెస్, ఫ్యాషన్, అప్పెరల్స్, టెలి కమ్యూనికేషన్స్, గ్రోసరీస్..వంటి రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అడుగు పెట్టని రంగం అంటూ ఏదీ లేదు. లోకల్ సెర్చింజిన్ను జస్ట్ డయల్ సైతం సొంతం చేసుకున్నారు. ఆయా సెక్టార్లలో ఇప్పటికే పాతుకు పోయిన కంపెనీలకు ప్రధాన పోటీదారుగా తయారైంది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈ పోటీని తట్టుకోవడానికి కాంపిటీటర్స్ సైతం తమ వ్యాపార పరిధిని పెంచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తోన్నారు. ఈ పరిణామాల మధ్య టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది.

టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కూడా టేకోవర్లపై దృష్టి సారించింది. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఇదీ ఒకటి. రిటైల్ సెగ్మెంట్ను నెలకొన్న పోటీని ఎదుర్కొనడానికి టాప్ బ్రాండ్స్కు చెందిన కంపెనీలను కొనుగోలు చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. దీనికోసం ఇప్పటికే చర్చల ప్రక్రియ సైతం ప్రారంభించింది. వచ్చే ఆరు నెలల కాలంలో కనీసం 60 చిన్న తరహా గ్రోసరీస్, ఇతర గృహావసర కన్స్యూమర్ బ్రాండ్స్ను కొనుగోలు చేసేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంది.
టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ డిసౌజా ఈ విషయాన్ని వెల్లడించారు. టాప్ బ్రాండింగ్స్ను కొనుగోలు చేయడంపై ఇప్పటికే దృష్టి సారించామని, ఈ దిశగా చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ఓ బిజినెస్ డెయిలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ సెగ్మెంట్లో తమ వ్యాపార కార్యకలాపాల పరిధిని విస్తరించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, యునిలివర్ వంటి కంపెనీల నుంచి ఈ సెగ్మంట్లో పోటీ తీవ్రంగా ఉందని, దీన్ని అధిగమించాల్సి ఉందని వ్యాఖ్యానించారు. బాటిల్డ్ వాటర్ బిజినెస్లో కొనసాగుతున్న నౌరిష్కో బేవరేజెస్ లిమిటెడ్ కూడా ఈ జాబితాలో ఉంది. కాగా- స్టార్ బక్స్ కార్పొరేషన్ కింద ఏర్పాటు చేసిన కెఫేల సంఖ్యను మరింత పెంచబోతున్నామని డిసౌజా అన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 26 నగరాల్లో 268 కెఫెలను కొత్తగా ఏర్పాటు చేశామని, ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనూ కొత్త వాటిని జత చేస్తామని అన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications