Tata News: దేశం కోసం ఎప్పుడైనా, ఏదానా చేసేందుకు సిద్ధంగా ఉండే మెుట్టమెుదటి వ్యాపార సంస్థ టాటా గ్రూప్. దేశానికి స్వాతంత్ర్యం రాక ముందు నుంచి వీరు అనేక రూపాల్లో దేశానికి తమ వంతు సహాయం చేస్తూనే ఉన్నారు.
తాజాగా సైన్యానికి అవసరమైన కీలక సాంకేతికలను టాటాలు సిద్ధం చేశారు. ఇప్పటికే భారత మిలిటరీ వినియోగించే అనేక ట్రక్కులు, ఆయుధాలు, వాటి విడిభాగాలను టాటా సంస్థలు తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే కొన్ని యంత్రాలు, జలాంతర్గాముులతో పాటు ఇతర రక్షణ వ్యవస్థలను విదేశీ సంస్థలతో కలిసి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా కూడా టాటా గ్రూప్ దేశంలోనే తయారు చేయటంలో భాగంగా కూడా ఉంది.

చైనా-పాకిస్తాన్ సరిహద్దు భద్రతను పటిష్టం చేయడానికి టాటా గ్రూప్ సంస్థ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ రంగంలోకి దిగింది. కంపెనీ హై-రిజల్యూషన్ ఇమేజరీ శాటిలైట్లను తయారు చేయడానికి కొత్త ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. ఇవి చైనా-పాకిస్థాన్ సరిహద్దులను అధునాతన పద్ధతిలో పర్యవేక్షించేందు భారత ఆర్మీకి కీలకంగా వ్యవహరించనున్నాయి. బెంగళూరులోని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఫ్యాక్టరీ సబ్ మీటర్ రిజల్యూషన్ శాటిలైట్లను తయారు చేసేందుకు సిద్ధమైంది. దీనితో పాటు శాటిలైట్ల నిర్వహణకు బెంగళూరులో గ్రౌండ్ స్టేషన్ను కూడా ఏర్పాటు చేయనున్నారు.
గ్రౌండ్ స్టేషన్ ద్వారా ఉపగ్రహాల కదలికను నియంత్రించవచ్చు. బెంగళూరు నుంచే భారత సరిహద్దు వెంబడి సైనిక మౌలిక సదుపాయాలను పర్యవేక్షించేందుకు మార్గం సుగమం కానుంది. సైన్యం లక్ష్యస్థానానికి అవసరమైన చిత్రాలు ఇవి అందిస్తాయి. ఇందుకోసం టాటా గ్రూప్ లో ఎర్త్ ఆర్బిట్(LEO) ఉపగ్రహాలను తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వీటి తయారీ కోసం టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఫ్యాక్టరీని స్థాపించడానికి లాటిన్ అమెరికాకు చెందిన శాటెలాజిక్తో జతకట్టింది. రానున్న 6 నెలల్లో 0.5 మీటర్ల రిజల్యూషన్తో కూడిన ఉపగ్రహాలను తయారు చేయాలని ఈ జోడీ నిర్ణయించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications