Air India: టాటా గ్రూప్ ఇటీవల కొనుగోలు చేసిన తర్వాత దూరమైన కస్టమర్లను చేరువచేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. వారికి విశ్వసనీయతతో సేవలను మెరుగుపరుస్తున్నట్లు కంపెనీ తెలిపింది. దీనికితోడు పెరుగుతున్న నెట్వర్క్, ఫ్లీట్పై దృష్టి పెట్టడానికి ఎయిర్ ఇండియా 5 ఏళ్ల ప్రణాళికను ఆవిష్కరించింది. దీనికి Vihaan.AI అని పేరు పెట్టింది. దేశీయ విమానయాన రంగంలో తన మార్కెట్ వాటాను కనీసం 30%కి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మార్కెట్ లీడర్ గా మారేందుకు..
ఎయిరిండియాను స్థిరమైన వృద్ధి, లాభదాయకత, మార్కెట్ నాయకత్వానికి మార్గంలో ఉంచడమే ఈ ప్రణాళిక లక్ష్యమని కంపెనీ వెల్లడించింది. ప్రణాళికను సిద్ధం చేసే క్రమంలో కంపెనీ తన ఉద్యోగుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంది. అసాధారణమైన కస్టమర్ అనుభవం, బలమైన కార్యకలాపాలు, పరిశ్రమ-ఉత్తమ ప్రతిభ, ఇండస్ట్రీ లీడర్షిప్, వాణిజ్య సామర్థ్యం, లాభదాయకతలు ఇందులో కీలక అంశాలుగా ఉన్నాయి.

చారిత్రాత్మక మార్పుకు నాంది..
కొత్త ఎయిర్ ఇండియా కోసం పునాది వేస్తున్నట్లు CEO క్యాంప్బెల్ విల్సన్ అన్నారు. కంపెనీని ప్రపంచ స్థాయి సంస్థగా మార్చేందుకు Vihaan.AI ప్రణాళికని అన్నారు. గ్లోబల్ కస్టమర్లకు సేవలు అందించటానికి ఎయిర్ ఇండియా పూర్తి స్థాయిలో సన్నద్దమౌతోందని తెలియజేశారు. ఇది నిజయంగా భారతీయులకు గర్వించదగ్గ విషయం.

90 ఏళ్ల కిందట..
JRD టాటా 90 ఏళ్ల క్రితం ఎయిర్ ఇండియా మొదటి విమానాన్ని పైలట్ చేశారు. అప్పటి నుంచి ఎయిర్ ఇండియా, దాని ఉద్యోగులు టాటా గ్రూప్లోకి తిరిగి రావడానికి ముందు అనేక సవాళ్లను ఎదుర్కొన్నట్లు కంపెనీ తెలిపింది. "Vihaan.AI అనేది గ్లోబల్ మ్యాప్లో ఎయిర్ ఇండియాను పునరుద్ధరించడానికి రోడ్ మ్యాప్, దీనిని ప్రపంచ స్థాయి, డిజిటల్, ఇండియన్ ఎయిర్లైన్గా మార్చడానికి ఉద్దేశించబడిందని కంపెనీ చెబుతోంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications