Sridhar Vembu: జోహో కంపెనీ IT పరిశ్రమలో సుపరిచితమైన పేరు. సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ (సాస్) స్పేస్లో ప్రముఖ ప్లేయర్గా కంపెనీ కొనసాగుతోంది. పైగా కంపెనీ లాభదాయకతతో ముందుకు సాగుతోంది. 2022 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఏకంగా రూ.2,747 కోట్ల లాభాన్ని ఆర్జించింది.
జోహో సహ వ్యవస్థాపకుడు, CEO శ్రీధర్ వెంబు దేశ వ్యాపార వర్గాల్లో గౌరవనీయమైన వ్యక్తి. ఈ క్రమంలో తాజాగా ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. అమెరికాలో సౌకర్యవంతమైన జీవితాన్ని విడిచి తమిళనాడులో చిన్న గ్రామంలో స్థిరపడ్డారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను డిజిటలీకరణ వైపు నడిపిస్తూ యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు.
దాదాపు 5 బిలియన్ డాలర్లు విలువైన కంపెనీని విజయవంతంగా సృష్టించి నిర్వహిస్తున్న వెంబు వ్యక్తిగత జీవతింలో మాత్రం వివాదాల్లో చిక్కుకున్నారు. ఈ క్రమంలో వెంబు ఫోర్బ్స్ సోమవారం ప్రచురించిన నివేదికలో వెంబు భార్య, కొడుకును కాలిఫోర్నియాలో విడిచిపెట్టాడని.. భార్యకు చెప్పకుండానే ఆమె వాటాలను బదిలీ చేశాడని పేర్కొంది.
ప్రస్తుతం వెంబు, అతని భార్య ప్రమీలా శ్రీనివాసన్ కాలిఫోర్నియాలో విడాకుల కేసు కోసం పోరాడుతున్నారు.తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాలను క్లియర్ చేయడానికి వెంబు మంగళవారం మధ్యాహ్నం ట్విట్టర్ను వేదికగా మార్చుకున్నారు. తన క్యారెక్టర్ ను దుర్మార్గపు వ్యక్తిగా చిత్రీకరించటం, దూషనలు చేయటంతో తాను స్పందించాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ప్రత్యేక అవసరాలు ఉన్న తన కుమారుడి పరిస్థితి తనను "suicidally depressed"గా మార్చిందని అతను చెప్పారు.

"నా భార్య ప్రమీల, నేను 15 సంవత్సరాలుగా ఆటిజంపై ఈ పోరాటంలో ఉన్నాము. ఆమె ఒక సూపర్ మామ్, ఆమె ఉద్వేగభరితమైన కారణం మా కొడుకు ఆటిజంను నయం చేయడం. నేను ఆమెతో పాటు కష్టపడ్డాను. అతని భద్రత కోసం నేను అతనిలో కొంత భాగాన్ని కూడా తీసుకున్నాను. చికిత్సలు చేయడం వలన వారు అతనికి ఏమి చేశారో నేను తెలుసుకోగలిగాను," అని అతను రాశాడు, "మా అబ్బాయి పెద్దవాడయ్యాక అతను తీసుకున్న అంతులేని చికిత్సలు పెద్దగా సహాయం చేయలేదని నేను భావించాను. అతను గ్రామీణ భారతదేశంలో మరింత మెరుగ్గా ఉంటాడు. ప్రజలను ప్రేమించడం, ప్రజలను పైకి తీసుకురావడానికి సహాయం చేయడం. నేను వదులుకుంటున్నానని ఆమె భావించింది. ఆ ఒత్తిడితో మా వివాహం కుప్పకూలింది." అని వెంబు వెల్లడించారు.

భార్య ప్రమీల ఆమె మామ మాటల ద్వారా ప్రభావితమవుతోందని వెంబు అన్నారు. వారిద్దరూ తనపై ప్రతీకారం తీర్చుకున్నారని చెప్పారు. భార్య, కొడుకు USలో "చాలా ధనిక జీవితాన్ని అనుభవిస్తున్నారని" అతను పేర్కొన్నారు. ఆటిజంను ఎదుర్కోవడంపై దృష్టి సారించిన ప్రమీల ఫౌండేషన్కు జోహో మద్దతునిస్తూనే ఉందని తెలిపారు. వాటాల బదిలీ విషయంలో ప్రమీల చేసిన ప్రకటన పూర్తిగా కల్పితమైనదని వెంబు స్పష్టం చేశారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications