Suzlon Stock: సుజ్లాన్ ఎనర్జీ ఇన్వెస్టర్లకు సడెన్ షాక్.. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా..?

Suzlon Energy: ఇటీవలి కాలంలో ఎక్కువగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల నోట నలుగుతున్న షేర్లలో సుజ్లాన్ ఎనర్జీ కూడా ఒకటి. ఒకప్పుడు పెన్నీస్టాక్ గా ఉన్న కంపెనీ షేర్లు ప్రభుత్వం రెన్యూవబుల్ ఎనర్జీ చర్యలతో చాలా కాలంగా పెరుగుతూనే ఉంది. దీంతో అనేక మంది ఇన్వెస్టర్లు ఈ ఎనర్జీ మల్టీబ్యాగర్ కంపెనీ షేర్ల కోసం ఎగబడిన పరిస్థితులు తెలిసిందే.

నేడు ఇంట్రాడేలో సుజ్లాన్ ఎనర్జీ స్టాక్ అత్యంత కీలకమైన లెవెల్ రూ.50 వద్ద తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. దీనికి ముందు కూడా కంపెనీ షేర్లు గత నెల జనవరి 28న ఇదే స్థాయి వద్ద ట్రేడింగ్ కొనసాగించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి చాలా మంది పెట్టుబడిదారులు ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించే పద్దు కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ క్రమంలో రెన్యూవబుల్ ఎనర్జీ రంగం ప్రోత్సాహానికి ఎలాంటి చర్యలు ఉంటాయి, అవి భవిష్యత్తులో పెట్టుబడిదారులకు ఎలాంటి రాబడిని అందిస్తాయనే అంశంపై అవగాహన కోసం వారు ఎదురుచూశారు.

Suzlon stock Breaks support level at 50 rupees Know brokerages call for Investors

గడచిన 6 నెలల కాలంలో కంపెనీ షేర్లు దాదాపు 37.52 శాతం క్షీణతను అందించగా.. 2025 ప్రారంభం నుంచి స్టాక్ 23 శాతానికి పైగా పడిపోయింది. అయితే నేడు మార్కెట్లు ముగిసే సమయంలో సుజ్లాన్ స్టాక్ ఎన్ఎస్ఈలో ఒక్కోటి రూ.50.64 వద్ద తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. కంపెనీ షేర్ల 52 వారాల గరిష్ఠ ధర రూ.86 నుంచి ప్రస్తుతం కంపెనీ షేర్లు దాదాపు 42 శాతం తక్కువ రేటు వద్ద తమ ప్రయాణాన్ని మార్కెట్లో కొనసాగిస్తున్నాయి.

బ్రోకరేజ్ మాట ఇదే..
సుజ్లాన్ ఎనర్జీ కంపెనీ షేర్లపై చాయిస్ బ్రోకింగ్ నిపుణుడు మండ్ర భోజనే స్పందిస్తూ స్టాక్ బేరిష్ ట్రెండ్ కారణంగా సైడ్ వేస్ ట్రేడింగ్ కొనసాగిస్తోందని అన్నారు. ఇటీవలి కాలంలో కంపెనీ షేర్లు దాదాపు 20 శాతం తగ్గుదలను చూసి దాదాపు రూ.50 స్థాయి వద్దకు చేరుకున్నాయని పేర్కొన్నారు. షేర్లు 54 స్థాయిని అధిగమిస్తే సమీప భవిష్యత్తులో రూ.64 స్థాయి వరకు చేరుకోవచ్చని కంపెనీ వెల్లడించగా.. స్టాక్ ధర 50 కిందకు పడిపోతే తర్వాతి సపోర్ట్ జోన్ లెవెల్ రూ.46 వద్ద ఉందని ఆయన పేర్కొన్నారు.

- ఇదే క్రమంలో జేఎం ఫైనాన్షియల్ కంపెనీ షేర్లకు రూ.80గా కంపెనీ ప్రకటిస్తూ BUY రేటింగ్ అందించింది.

కంపెనీ లాభాలు..
ఇటీవలి కాలంలో కంపెనీ తన త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మూడవ క్వార్టర్లో ఏడాది ప్రాతిపదికన కంపెనీ లాభాలు 90 శాతానికి పైగా పెరుగుదలను చూశాయి. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర ఆదాయం రూ.388 కోట్లుగా ఉంది. ఇదే కాలానికి కంపెనీ ఆదాయం భారీగా పెరిగి రూ.2,969 కోట్లుగా నమోదు కావటంతో భవిష్యత్తు వ్యాపారంపై ఇన్వెస్టర్లలో కొత్త ఆశలు చిగురించాయి.

Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+