Suzlon Energy: స్టాక్ మార్కెట్లో అద్భుతమైన పెరుగుదల కొనసాగిస్తున్న కంపెనీపై ఆదాయపు పన్ను అధికారులు సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో పెనాల్టీలు సైతం విధించటం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది సుజ్లాన్ ఎనర్జీ కంపెనీ షేర్ల గురించే. కంపెనీ స్టాక్ ఈరోజు ప్రారంభ ట్రేడ్లో పడిపోయాయి. అయితే త్వరలో స్టాక్ కౌంటర్ ప్రకాశవంతంగా కనిపించడం ప్రారంభించింది. మధ్యాహ్నం 1:15 గంటల ప్రాంతంలో సుజ్లాన్ ఎనర్జీ 2.85 శాతం పెరిగి రూ.41.55 వద్ద ట్రేడవుతోంది. ఉదయం రూ.39.95 వద్ద ప్రారంభమై రూ.38.40కి తగ్గింది.

2015-16 ఆర్థిక సంవత్సరం, 2017-18 కోసం ఆదాయపు పన్ను శాఖ రెండు ఆదాయపు పన్ను పెనాల్టీ ఉత్తర్వులను జారీ చేసింది. దీని తరువాత సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ షేర్లు మార్కెట్లో అద్భుతమైన పెరుగుదల మధ్య ఉదయం 3% కంటే ఎక్కువ పడిపోయాయి. రెండు పెనాల్టీ ఆర్డర్లు వరుసగా రూ.87.59 కోట్లు, రూ.172.76 కోట్లుగా ఉన్నాయి. దీనికి ముందు గడచిన 5 రోజుల కాలంలో సుజ్లాన్ ఎనర్జీ కంపెనీ షేర్లు సుమారు 13 శాతం పెరుగుదలను నమోదు చేశాయి.
అలాగే గత నెలలో 6 శాతం క్షీణత నమోదైంది. గత ఆరు నెలల్లో సుజ్లాన్ ఎనర్జీ దాదాపు 55 శాతం రాబడిని ఇచ్చింది. కాగా గత ఏడాది కాలంలో 413% భారీ రాబడిని ఇవ్వడం ద్వారా తన పెట్టుబడిదారులను ధనవంతులను చేసింది. ప్రతికూల వార్తల నేపథ్యంలో కంపెనీ మార్కెట్ క్యాప్ బీఎస్ఈలో రూ.55,263 కోట్లకు పడిపోయింది. అయితే తిరిగి పుంజుకున్న తర్వాత రూ.56,530 కోట్లకు చేరింది. కంపెనీ టెక్నికల్స్ పరిశీలిస్తే షేర్లు ఓవర్బాట్ లేదా ఓవర్సోల్డ్ జోన్లలో ట్రేడింగ్ చేయడం లేదని వెల్లడైంది.
కంపెనీ ప్రస్తుతం పన్ను అధికారులు జారీ చేసిన జరిమానాలపై అప్పీల్ దాఖలు చేసి న్యాయపరమైన పోరాటం కొనసాగించాలని నిర్ణయించింది. ఉత్తర్వులను సవాలు చేసే పనిలో నిమగ్నమై ఉంది. సుజ్లాన్ ఎనర్జీ మూడవ త్రైమాసిక లాభం రూ.69.8 కోట్ల నుంచి 160 శాతం పెరిగి రూ.203.2 కోట్లకు చేరుకుంది. సుజ్లాన్ ఎనర్జీ విండ్ టర్బైన్ల తయారీలో గుర్తింపును తెచ్చుకుంది.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications