Suzlon Energy Stock: దేశీయంగా తక్కువ ధరలో అందుబాటులో ఉన్న రెన్యూవబుల్ ఎనర్జీ రంగానికి చెందిన షేర్లకు నిరంతరం డిమాండ్ కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విండ్ ఎనర్జీ రంగానికి చెందిన సుజ్లాన్ ఎనర్జీ షేర్లపై పెట్టుబడిదారుల ఫోకస్ కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా దాదాపు 38 శాతం క్షీణతను చూసిన ఈ కంపెనీ షేర్లు మళ్లీ తిరిగి గాడినపడ్డాయి.
నేడు ఇంట్రాడేలో విండ్ ఎనర్జీ కంపెనీ షేర్లు మార్కెట్లో 5 శాతం పెరుగుదలతో అప్పర్ సర్క్యూట్ తాకాయి. దీంతో కంపెనీ షేర్ ధర బీఎస్ఈలో రూ.62.37కి చేరుకుంది. అయితే ఒక్కసారిగా ఇన్వెస్టర్లు కంపెనీ షేర్ల కొనుగోలుకు ఎగబడటానికి కారణం రేటింగ్ అప్ గ్రేడ్ గా తెలుస్తోంది. ప్రముఖ విదేశీ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తాజాగా విండ్ ఎనర్జీ కంపెనీ అయిన సుజ్లాన్ షేర్లకు తన రేటింగ్ ప్రకటించింది. గతంలో అందించిన సమాన బరువు నుంచి ప్రస్తుతం అధిక బరువుకు రేటింగ్ పెంచబడింది. దీనికి ముందు నవంబర్ 12 నుంచి కంపెనీ షేర్ల ధర ఒక్కోటి రూ.60 కంటే తక్కువకు దిగజారాయి. ఈ క్రమంలో చివరిగా సెప్టెంబర్ 12, 2024న కంపెనీ షేర్లు తమ 52 వారాల గరిష్ఠ ధర రూ.86.05ని చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి కరెక్షన్ కి గురైన స్టాక్ ఏకంగా 33 శాతానికి పైగా పతనాన్ని చూసింది.

ఈ క్రమంలో ప్రస్తుతం మోర్గన్ స్టాన్నీ కొత్తగా అప్ గ్రేజ్ చేసిన షేర్ టార్గెట్ ధరపై అందరి చూపు కొనసాగుతోంది. రానున్న కాలంలో స్టాక్ ధర రూ.71 స్థాయికి చేరుకోవచ్చని బ్రోకరేజ్ పేర్కొంది. ఇటీవలి కాలంలో సుజ్లాన్ స్టాక్ భారీగా పతనాన్ని చూసిన తర్వాత ప్రస్తుతం ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను కొనసాగించటానికి అనువైన సమయమని ఈ అవకాశాన్ని వారు వినియోగించుకోవాలని మోర్గన్ స్టాన్లీ వెల్లడించింది. దీంతో చాలా మంది పెట్టుబడిదారులు తిరిగి కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. ఈ క్రమంలో నేడు ఇంట్రాడేలో స్టాక్ 5 శాతం అప్పర్ సర్యూట్ ధర రూ.62.22 వద్ద ఎన్ఎస్ఈలో కొనసాగుతోంది.
సుజ్లాన్ ఎనర్జీ షేర్లు నాలుగు వరుస సెషన్ల తర్వాత నేడు రూ.60 మార్కును తిరిగి పొందాయి. మల్టీబ్యాగర్ స్టాక్ మూడవ సెషన్లో 5% అప్పర్ సర్క్యూట్ను తాకింది. గడచిన రెండేళ్ల కాలాన్ని పరిశీలిస్తే స్టాక్ తన పెట్టుబడిదారులకు ఏకంగా 670 శాతం పెరుగుదలను చూసింది. 18 నవంబర్ 2022న కంపెనీ షేర్ ధర ఒక్కోటి రూ.8.10 వద్ద ఉంది. అలాగే మూడేళ్ల కాలంలో పెట్టుబడిదారులు స్టాక్ నుంచి 883% రాబడిని అందుకున్నారు. ఇదే క్రమంలో స్టాక్ గత ఏడాది కాలంలో తన పెట్టుబడిదారులకు 50 శాతం కంటే ఎక్కువ రాబడిని తెచ్చిపెట్టింది.
- ప్రస్తుతం దేశీయ బ్రోకరేజ్ సంస్థ జియోజిత్ కంపెనీ షేర్లకు BUY రేటింగ్ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో కంపెనీ షేర్లకు రూ.68 టార్గెట్ ధరను అందించింది.
- మరో బ్రోకరేజ్ సంస్థ ప్రభుదాస్ లిల్లాధర్ సుజ్లాన్ ఎనర్జీ షేర్లకు టార్గెట్ ధరను గతంలో అందించిన రూ.70 నుంచి ప్రస్తుతం రూ.75కి పెంచింది.
- అలాగే ఛాయిస్ బ్రోకింగ్ కంపెనీ సైతం ప్రస్తుత ధరలు షేర్ల కొనుగోలుకు అనుకూలమైనదిగా పేర్కొంది. ఒకవేళ స్టా ధర సపోర్ట్ లెవల్ కిందకు జారితే మరింతగా దిగజారే ప్రమాదం ఉందన్నారు. ఈ క్రమంలో టార్గెట్ ధరను రూ.66-70గా పేర్కొంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications