Suzlon Energy Shares: చాలా కాలంగా దేశీయ స్టాక్ మార్కెట్లలో తిరుగులేని ప్రయాణాన్ని చూస్తున్న సుజ్లాన్ కంపెనీ షేర్లు ప్రస్తుతం పతనంలో కొనసాగుతున్నాయి. సోమవారం వరుసగా 8వ ట్రేడింగ్ సెషన్లోనూ నష్టాలను చవిచూసింది. అయితే దీనికి మార్కెట్ల పతనంతో పాటు స్టాక్ ఎక్స్ఛేంజీల హెచ్చరిక కూడా కీలకమైనదిగా ఉంది.
రెన్యూవబుల్ ఎనర్జీ సొల్యూషన్ ప్రొవైడర్ BSE, NSE బోర్సెస్ నుంచి 'సలహా కమ్ హెచ్చరిక' లేఖను అందుకుంది. గతంలో రాజీనామా చేస్తున్న స్వతంత్ర డైరెక్టర్ లేవనెత్తిన సమస్యలపై కంపెనీ నుంచి వచ్చిన ప్రతిస్పందనలు, పత్రాలను సమీక్షించినప్పుడు కంపెనీ మెరుగైన కార్పొరేట్ గవర్నెన్స్ పద్ధతులను అనుసరించే కొన్ని సందర్భాలు ఉన్నట్లు గుర్తించబడినట్లు ఎక్స్ఛేంజీలు పేర్కొన్నాయి. ఈ లేఖలో జూన్ 8, 2024న సుజ్లాన్ సమర్పించిన బహిర్గతం గురించి, స్వతంత్ర డైరెక్టర్గా మార్క్ దేశాడెలీర్ రాజీనామా చేయడం గురించి, రాజీనామా లేఖ కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలు అంచనాలను అందుకోలేదని హైలైట్ చేసింది.

ఈ ప్రభావం కంపెనీ షేర్లపై నిరంతరం కొనసాగుతున్న వేళ నేడు విండ్ ఎనర్జీ స్టాక్ ధర 5 శాతం పతనాన్ని చూసింది. దీంతో నేడు ఒక్కో షేరు రూ.70.93 రేటు వద్ద ప్రయాణాన్ని ముగించాయి. అలాగే గడచిన ఐదు రోజులుగా స్టాక్ దాదాపు 12 శాతానికి పైగా నష్టపోయింది. ఈ పరిస్థితుల్లో కంపెనీ వివరణ ఇస్తూ స్టాక్ ఎక్స్ఛేంజీలు లేవనెత్తిన హెచ్చరికలు లేదా సూచనలు కంపెనీ కార్యాచరణపై ప్రత్యక్షంగా ఎలాంటి ప్రభావం చూపబోవని పేర్కొంది. ఈ క్రమంలో ప్రస్తుతం టెక్నికల్స్ పరిశీలిస్తే సమీపకాలంలో స్టాక్ ధర రూ.68 స్థాయికి చేరకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో విండ్ ఎనర్జీ పరిష్కారాలను అందిస్తున్న సుజ్లాన్ కంపెనీ షేర్లు గడచిన ఏడాది కాలంలో మంచి రాబడిని అందిస్తూ 156 శాతం పెరుగుదలను చూశాయి. అలాగే దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు 5 ఏళ్ల కాలంలో ఏకంగా 2800% బలమైన రాబడులను పొందారు. ఈ క్రమంలో షేర్ల ధర అత్యల్పంగా రూ.2.41 స్థాయి నుంచి గరిష్ఠంగా రూ.86 స్థాయిలకు పెరిగాయి. ఈ క్రమంలో ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.96 వేల కోట్లుగా ఉంది. దీనికి ముందు కంపెనీ మార్కెట్ క్యాప్ ఏకంగా రూ.లక్ష కోట్ల మార్కును అందుకుంది.
విండ్ టర్బైన్ల తయారీ, విక్రయం, సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్ వ్యాపారంలో అగ్రగామిగా కొనసాగుతున్న కంపెనీ గడచిన నెలలో ప్రభుత్వ యాజమాన్యంలోని ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ నుంచి అతిపెద్ద ఆర్డర్ అందుకుంది. ఈ ప్రాజెక్ట్ కింద దాదాపు 370 వింట్ టర్బైన్ల సరఫరాకు డీల్ అందుకుంది. ఈ ప్రాజెక్ట్ కెపాసిటీ 3.15 మెగా వాట్లుగా ఉంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications