Global Leader: G20 సమావేశాలను విజయవంతంగా నిర్వహించిన భారత్ పై.. ప్రపంచంతో పాటు శత్రు దేశాలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నాయి. భారత నాయకత్వ పటిమను పలు దేశాధినేతలు సహా అంతర్జాతీయ మీడియా సైతం గుర్తించింది. గ్లోబల్ లీడర్ గా ప్రధాని నరేంద్ర మోదీ పేరు మారు మోగిపోతోంది. అగ్రరాజ్యం సైతం నమో మోదీ అంటూ మన ప్రధాని పాలనా దక్షతకు, విదేశాంగ విధానానికి తలచుతోంది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తన సత్తా చాటారు. G20 సమావేశం అనంతరం 'మార్నింగ్ కన్సల్ట్' సంస్థ నిర్వహించిన సర్వేలో అగ్రస్థానం దక్కించుకున్నారు. 'గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్ ట్రాకర్' పేరిట జరిగిన ఈ సర్వేలో.. 76 శాతం మంది ప్రజలు మోడీ లీడర్షిప్ ను కొనియాడారు. 18 శాతం మంది వ్యతిరేకంగా ఓటేయగా.. మరో 6 శాతం మంది తటస్థంగా ఉన్నట్లు సర్వే నివేదిక పేర్కొంది.

దీంతో అంతర్జాతీయ దేశాధినేతలతో పోలిస్తే నరేంద్ర మోదీ టాప్ లీడర్గా కొనసాగుతున్నారు. గతంలోనూ ఈ ర్యాంకింగ్స్ లో మన ప్రధాని అగ్రస్థానంలో నిలిచారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షులు జో బైడెన్, కెనడా PM జస్టిన్ ట్రూడో, UK PM రిషీ సునాక్ వంటి దేశాధినేతలతో పోలిస్తే.. స్విట్జర్లాండ్ మరియు మెక్సికో ప్రెసిడెంట్స్ మెరుగైన ర్యాంకింగ్స్ సాధించడం విశేషం.
ఇటీవల ముగిసిన G20 సమావేశాల్లో ఆయా దేశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్ ను ముక్తకంఠంతో ఆమోదించాయి. తద్వారా సభ్యదేశాలను ఏకతాటిపైకి తీసుకొచ్చిన ఘనత భారత్ సొంతమైంది. 'వన్ ఎర్త్.. వన్ ఫ్యామిలీ.. వన్ ఫ్యూచర్' నినాదంతో వసుదైక కుటుంబంగా కలిసి నడుద్దామని ప్రపంచ దేశాలకు భారత్ ఇచ్చిన పిలుపు.. యావత్ మానవజాతిని ఆలోచింపజేసింది అనడంలో సందేహం లేదు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications