Baba Ramdev: గత వాయిదాలో బాబా రామ్దేవ్, కంపెనీ సీఈవో బాలకృష్ణలు కోర్టు ముందు తప్పక కావాల్సిందేనని ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. నేడు పతంజలి వ్యవస్థాపకుడు బాబా రామ్దేవ్పై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.
పతాంజలి కంపెనీ "తప్పుదోవ పట్టించే" ప్రకటనలపై అత్యున్నత న్యాయస్థానానికి ఇచ్చిన హామీని తీవ్రంగా ఉల్లంఘించిందని పేర్కొంది. ఈ క్రమంలో ధర్మాసనం గత తీర్పుకు అనుగుణంగా.. పతంజలి ఆయుర్వేద ఎండీ ఆచార్య బాలకృష్ణతో కలిసి బాబా రామ్దేవ్ నేడు స్వయంగా కోర్టులో హాజరయ్యారు. కోర్టుకు తాను బేషరతుగా క్షమాపణలు చెప్పడాన్ని గమనించాలని కోర్టును కోరారు. షోకాజ్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వీరిద్దరూ కోర్టుకు హాజరయ్యారు.

నవంబర్ 21, 2023న మీడియాకు తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వవద్దని లేదా "ఔషధ ప్రభావాన్ని క్లెయిమ్ చేసే లేదా ఏదైనా ఔషధ వ్యవస్థకు వ్యతిరేకంగా సాధారణ ప్రకటనలు" చేయవద్దని కోర్టు కంపెనీని కోరింది. ఈ ఏడాది ఫిబ్రవరి 27న ఒక ప్రకటనతో బయటకు వచ్చి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినందుకు గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ కోర్టు కంపెనీకి, బాలకృష్ణకు నోటీసు జారీ చేసింది. మార్చి 19న, ఫిబ్రవరి 27 నోటీసుకు ఎలాంటి సమాధానం దాఖలు చేయలేదని బెంచ్ గుర్తించి. దీంతో అత్యున్నత న్యాయస్థానం బాబా రామ్దేవ్కు నోటీసు జారీ చేయాలని నిర్ణయించింది.
బాబా రామ్దేవ్ హాజరుపై కోర్టు కీలక కామెంట్స్ చేస్తూ.. "ఇది సంపూర్ణ ధిక్కరణ. సుప్రీంకోర్టు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న కోర్టులు ఇచ్చే ప్రతి ఉత్తర్వును గౌరవించాలి' అని ధర్మాసనం పేర్కొంది. "మీరు కోర్టుకు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలి, మీరు ప్రతి అడ్డంకిని అధిగమించారు" అని కోర్టు పతంజలి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే క్రమంలో కరోనా మహమ్మారికి అల్లోపతిలో నివారణ లేదని పతంజలి చెబుతున్నప్పుడు ఆయుష్ మంత్రిత్వ శాఖ ఎందుకు కళ్లు మూసుకుందని కోర్టు కేంద్రాన్ని నిలదీసింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కళ్లు మూసుకున్నట్లు కనిపించడం తమకు ఆశ్చర్యం కలిగిస్తోందని జస్టిస్ హిమ కోహ్లీ విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలో వారంలోగా తమ అఫిడవిట్లను దాఖలు చేసేందుకు రామ్దేవ్, బాలకృష్ణలకు కోర్టు చివరి అవకాశం ఇచ్చింది. ఈ వ్యాజ్యాన్ని తదుపరి విచారణకు ఏప్రిల్ 10న పోస్ట్ చేస్తూ.. తర్వాతి తేదీన కూడా విచారణకు రామ్దేవ్, బాలకృష్ణ తమ ముందు హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications