వాషింగ్టన్: కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు, తద్వారా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. అయితే 2021 ఎండాకాలం నాటికి దాదాపు పూర్తిగా సర్దుకోవచ్చునని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా వ్యాక్సీన్ అందుబాటులోకి వస్తే, దాదాపు అన్ని కార్యకలాపాలు తిరిగి కరోనా ముందుస్థాయికి చేరుకుంటాయన్నారు. 'వ్యాక్సీన్ అప్రూవల్స్ త్వరగా వచ్చి, అందుబాటులోకి వస్తే వచ్చే సమ్మర్ నాటికి, దాదాపు అన్ని కార్యకలాపాలు పూర్వస్థితికి చేరుకోవచ్చు'నని గురువారం రాత్రి ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

వ్యాక్సీన్ ఫలితాలను బట్టి..
ఇప్పటికే ఫైజర్, మోడర్నా తమ తమ తమ వ్యాక్సీన్లు 95 శాతం ఫలితాలు ఇచ్చాయని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తమ వ్యాక్సీన్ అప్రూవల్స్ కోసం వేగంగా ముందుకు సాగుతున్నాయి. ట్రయల్స్ చివరి దశలో ఉన్నాయి. మొదటి టీకా డిసెంబర్ చివరలో అమెరికాలో ప్రారంభం కావొచ్చునని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బిల్ గేట్స్ వ్యాఖ్యలు గమనార్హం. వచ్చే ఏడాది మిడిల్ నాటికి ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లవచ్చునని, రెస్టారెంట్లు, బార్లు తెరుచుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రారంభం కంటే భిన్నమైన దశలో ఉన్నట్లు తెలిపారు. అలాగే ప్రతి స్కూల్ తెరుచుకోవచ్చునన్నారు.

వ్యాక్సీన్ పంపిణీ
వ్యాక్సీన్ పంపిణీపై కూడా బిల్ గేట్స్ స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని మూలల్లోకి వ్యాక్సీన్ వెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా అందరికీ చేరడానికి 10 బిలియన్లు లేదా వెయ్యి కోట్ల డోసులు అవసరమన్నారు. ప్రపంచంలోనే అత్యధిక కేసులు, మరణాలు అమెరికాలో చోటు చేసుకున్నాయి. భారత్ రెండో స్థానంలో ఉంది. ప్రతి నగరంలో, పట్ఠణంలో కార్యాలయాలు, పార్కులు, రెస్టారెంట్లు యథాతథ స్థితికి వస్తాయన్నారు. అయితే వ్యాక్సీన్ సరఫరా క్లిష్టమైన అంశమన్నారు.

డిసెంబర్ నాటికి వ్యాక్సీన్ ప్రారంభం
కరోనా తర్వాత 50 శాతం బిజినెస్ ట్రావెల్, 30 శాతం ఆఫీస్ లైఫ్ కనిపించకుండా పోవచ్చునని గేట్స్ అన్నారు. కాగా గేట్స్ అండ్ మిలిండా ఫౌండేషన్ ద్వారా అంతర్జాతీయంగా కరోనా కట్టడి కోసం 350 బిలియన్ డాలర్ల మేర సాయం అందించారు. అమెరికాలో కరోనా టీకాల పంపిణీ డిసెంబర్ సమయానికి ప్రారంభం కావొచ్చునని భావిస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications