IT Couple Success Story: రిస్క్ తీసుకోకపోతే జీవితంలో మిగిలేది రస్కే అని మనలో చాలా మందికి తెలుసు. అయితే నేటి కాలంలో ఐటీ ఉద్యోగులు, డాక్టర్లకు ఉన్న డిమాండ్ బాహాటంగా తెలిసిందే. అయితే అధిక ఆదాయం ఉన్న ఈ రంగాలకు చెందిన చాలా మంది ప్రస్తుతం పెద్ద వేతనాలను తిరస్కరిస్తూ తమ సొంత వ్యాపారాలను స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. చిన్నదైనా సొంత బిజినెస్ లో ఉంటే కిక్ వేరొకరి కింద ఎంత డబ్బుల కోసం పనిచేసినా రాదని యువత భావించటమే దీనికి కారణంగా తెలుస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఏపీకి చెందిన భార్యాభర్తల విజయగాథ గురించే. ఆంధ్రప్రదేశ్కు చెందిన కోటినాగ మణికంఠ, నాగ వెంకట దుర్గా పావని బీటెక్ గ్రాడ్యుయేట్స్. వీరు గతంలో ఇన్ఫోసిస్, యాక్సెంచర్ కంపెనీల్లో ఐటీ జాబ్స్ చేశారు. అయితే ఐటీ ఉద్యోగం కారణంగా దీర్ఘకాలంలో తమతోటి ఉద్యోగులు అనుభవిస్తున్న ఆరోగ్య సమస్యలను చూసి వారు తొందరగానే మేలుకున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం కంటే ఆరోగ్యం ముఖ్యమని, ఒక్కసారి ఆరోగ్యం కోల్పోతే అన్నీ కోల్పోతామని వారు గ్రహించి సొంతంగా వ్యాపారం స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో వారు గుంటూరులో 'శ్రేష్ఠే' అనే ఆర్గానిక్ ఫార్మింగ్ వెంచర్ను స్థాపించారు.

ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో వారు వ్యవసాయం వైపు మళ్లినట్లు మణికంఠ, పావని వెల్లడించారు. ఇందుకోసం వారు సుభాష్ పాలేకర్ నేచురల్ ఫార్మింగ్ పద్ధతిలో శిక్షణను కూడా పొందారు. అలా 2017లో శ్రేష్ఠేనుప్రారంభించడానికి రూ.17 లక్షల వరకు ఇన్వెస్ట్ చేశారు. అలా తొలినాళ్లలో సమీపంలోని వినియోగదారులకు మణికంఠ తానే స్వయంగా ఆర్గానిక్ ఉత్పత్తులను డెలివరీ చేసేవారు. అలా 2019లో తమ తొలి ఫిజికల్ స్టోర్ ప్రారంభించారు. కేవలం తాము పండించే పంటలతో పాటు అనేక మంది రైతులకు వీరు ఆసరాగా నిలుస్తూ వారి ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు సహాయపడుతున్నారు. ఈ క్రమంలో బియ్యం నుంచి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, మిల్లెట్ ఆధారిత స్నాక్స్తో సహా దాదాపు 160కి పైగా ఆర్గానిక్ ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులో ఉండేలా చేశారు. ప్రస్తుతం నాణ్యమైన ఆర్గానిక్ ఉత్పత్తులను ప్రజలకు అందిస్తూ ఏటా ఈ యువ జంట రూ.90 లక్షల వ్యాపారాన్ని చేస్తోంది.
అయితే జీరో బడ్జెట్ ఫార్మింగ్ నేర్చుకోవటానికి ఈ క్రమంలో కొంత ఇబ్బంది పడినట్లు మణికంఠ జంట వెల్లడించారు. తాము చెన్నైలో పనిచేస్తున్న సమయంలో ట్రేనింగ్ కోసం వారాంతాల్లో ఏపీలోని లచ్చన్నగుడిపూడి గ్రామానికి వచ్చేవారమని తెలిపారు. ఏకకాలంలో అటు పనిని, ఇటు ట్రైనింగ్ కొనసాగించటం కష్టంగా ఉన్నప్పటికీ నచ్చిన పనిచేయటం కోసం వాటిని ఎదుర్కొన్నట్లు జంట వెల్లడించింది. చాలా మంది ప్రజలు నేచురల్ లివ్వింగ్ పై అవగాహన పెంపొందించుకుంటూ ముందుకు సాగుతున్న వేళ తాము కూడా ప్రకృతిని ప్రేమించే కస్టమర్లకు అదే తరహా ఆహారాన్ని అందించటానికి ప్రయత్నిస్తున్నట్లు మణికంఠ వెల్లడించారు. రసాయనాలు, ఒత్తిడితో కూడిన లైఫ్ స్టైల్ నుంచి సహజమైన, పర్యావరణ అనుకూలమైన జీవనశైలికి మారటానికి ప్రజలకు సహాయపడుతున్నట్లు వెల్లడించారు.
More From GoodReturns

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

IT Jobs: కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఆగండి! ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఓసారి చూడండి!

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications