Startup Success:లాక్‌డౌన్‌లో జాబ్ పోవటంతో..స్టార్టప్ కంపెనీని ప్రారంభించారు..కోట్లకు వ్యాపారాన్ని విక్రయించారు

Startup Success: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో అనేక నెలల పాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించారు. ఆ సమయంలో చాలా మంది ఉద్యోగాలను కోల్పోయారు. ఇద్దరు స్నేహితులు ఆకాష్ మాస్కే, ఆదిత్య కీర్తన కూడా ఇలాంటి సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. లాక్‌డౌన్‌లో వారి కెరీర్ కూడా కష్టాల్లో పడింది. ఆ సమయంలో కుంగిపోకుండా ఒక స్టార్టప్ ను ప్రారంభించారు. దాని విజయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

లాక్‌డౌన్‌ కారణంగా..

లాక్‌డౌన్‌ కారణంగా..

లాక్‌డౌన్‌కు ముందు ఆకాష్, ఆదిత్య ఒక కంపెనీలో ఇంజనీర్లుగా పనిచేసేవారు. కానీ కొవిడ్ మహమ్మారి వారి జీవిత గమనాన్ని మార్చేసింది. లాక్‌డౌన్‌ మొదటి నెల సినిమాలు చూస్తూ గడిపారు. కానీ ప్రజలు ఇళ్లలోనే కొనసాగవలసి రావటం వల్ల ఉద్యోగం కోల్పోయారు. ఇది వారి వారి జీవితానికి పిడుగులాంటి వార్త. కానీ వారు దానికి భయపడలేదు.

ఇతర ఉద్యోగాల కోసం వెతకకుండా..

ఇతర ఉద్యోగాల కోసం వెతకకుండా..

ఔరంగాబాద్ చుట్టూ అనేక పారిశ్రామిక యూనిట్లు ఉన్నాయి. ఈ ఇద్దరు స్నేహితులు కావాలంటే వేరే కంపెనీలో ఉద్యోగ అవకాశం కోసం ప్రయత్నించవచ్చు. అయితే.. ఉద్యోగాలకు దరఖాస్తు చేయకుండా సొంతంగా వ్యాపారం చేయాలని వారు నిర్ణయించుకున్నారు. విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎలా మారాలనే దానిపై కొన్ని పుస్తకాలను చదివిన తర్వాత.. సొంత వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఏం చేయాలో వారికి తోచలేదు.

కొత్త వ్యాపారాన్ని ఇలా ప్రారంభించారు..

కొత్త వ్యాపారాన్ని ఇలా ప్రారంభించారు..

వారు స్థానిక విశ్వవిద్యాలయంలో మాంసం & పౌల్ట్రీ ప్రాసెసింగ్‌పై వృత్తిపరమైన శిక్షణా కోర్సుతో ప్రారంభించారు. దీంతో అసంఘటిత మాంసం మార్కెట్‌లోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇద్దరికీ మొదట్లో కుటుంబసభ్యుల నుంచి పూర్తి మద్దతు లభించలేదు. "మేము చేస్తున్న పనివల్ల తమ ఆడపిల్లను వివాహం చేసుకోవడానికి ఎవరూ ఇష్టపడరని మా కుటుంబాలు మొదట భావించాయి. కానీ తర్వాత మా కుటుంబ సభ్యులు ఒక్కతాటిపై నిలిచారు." అని ఆదిత్య ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

తొలి పెట్టుబడి రూ.25 వేలు..

తొలి పెట్టుబడి రూ.25 వేలు..

100 చదరపు అడుగుల విస్తీర్ణంలో తన స్నేహితుల సహకారంతో జమ చేసిన రూ.25,000 నిధులతో 'అపాటిటీ' అనే కంపెనీని ప్రారంభించారు. ఒక నెల టర్నోవర్ నెలకు నాలుగు లక్షల రూపాయలను దాటింది. వారి వ్యాపారం నెమ్మదిగా పెరగడం ప్రారంభించింది.

ఫాబీ రూ.10 కోట్లకు షేర్లను కొనుగోలు..

ఫాబీ రూ.10 కోట్లకు షేర్లను కొనుగోలు..

ఫ్యాబీ ఇటీవలే రూ.10 కోట్లకు అపెటైట్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. ఆదిత్య, ఆకాష్ కొంత వాటాతో ఇప్పటికీ దానితో అనుబంధం కలిగి ఉన్నారు. డీల్ తర్వాత 'అపాటిటీ' బ్రాండ్ కొనసాగుతుందని, తమ బ్యానర్‌లో కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తామని ఫాబీ డైరెక్టర్ ఫహద్ సయ్యద్ తెలిపారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+