IPO News: ఐపీవోల ట్రెండ్ ఫినిష్.. తొలిరోజే నష్టాలు, బెట్టింగ్ వేసి ఏడుస్తున్న ఇన్వెస్టర్స్..

Subam Papers IPO: అక్టోబర్ నెలలో దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ఎంట్రీ ఇస్తున్న ఐపీవోలు పూర్తిగా ఇన్వెస్టర్లను నిరాశకు గురిచేస్తున్నాయి. నిన్న మార్కెట్లోకి అరంగేట్రం చేసిన 2 ఐపీవోలు మిగిల్చిన చేదు నష్టాలను మరచిపోకముందే.. నేడు మరో షాక్ తగిలింది. మార్కెట్ల పతనం వేళ వస్తున్న ఐపీవోలు సైతం నిరాశను మిగులుస్తున్నాయి. దీంతో ఇన్నాళ్లుగా ఐపీవోల నుంచి మంచి లాభాలను అందుకున్న ఇన్వెస్టర్లు, పరిస్థితులు తారుమారు కావటంపై గందరగోళానికి గురవుతున్నారు.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది సుబామ్ పేపర్స్ లిమిటెడ్ కంపెనీ ఐపీవో గురించే. ఎస్ఎమ్ఈ కేటగిరీలో వచ్చిన ఐపీవో నేడు మార్కెట్లలో ఇష్యూ ధర కంటే 7 శాతం తగ్గింపు రేటు రూ.142 చొప్పున అడుగుపెట్టాయి. దీంతో డిస్కౌంటెడ్ లిస్టింగ్ కారణంగా బెట్టింగ్ వేసిన చాలా మంది నష్టాలను చవిచూశారు. లిస్టింగ్ తర్వాత సైతం కంపెనీ షేర్ల పతనం కొనసాగటంతో 12 శాతం క్షీణతను ఐపీవో షేర్లు ఇంట్రాడేలో చూశాయి. దీని తర్వాత కంపెనీ షేర్లు బీఎస్ఈలో నేడు రూ.134.90 స్థాయికి దిగజారాయి. ఇది చూస్తుంటే మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ హెచ్చరిక తర్వాత మార్కెట్లు ఎస్ఎమ్ఈ ఐపీవోలతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

Subam Papers IPO disappointed Investors with Discounted Listing Know details

సుబామ్ పేపర్స్ లిమిటెడ్ కంపెనీ తన ఐపీవోను సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు సాధారణ పెట్టుబడిదారులు దరఖాస్తు చేసుకునేందుకు తెరచి ఉంచింది. ఈ క్రమంలో ఒక్కో షేరుకు ప్రైస్ బ్యాండ్ ధరను రూ.114-152గా ప్రకటించింది. ఈ ఐపీవో ద్వారా కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.93.70 కోట్లను సమీకరించింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్లోని ఇన్వెస్టర్లకు 61.65 తాజా ఈక్విటీ షేర్లను విక్రయించింది. కంపెనీ రిటైల్ పెట్టుబడిదారులు ఇన్వెస్ట్ చేసేందుకు లాట్ పరిమాణాన్ని 800 షేర్లుగా నిర్ణయించింది. దీంతో ఐపీవోపై బెట్టింగ్ వేసేందుకు ఇన్వెస్టర్లు లాట్ కొనుగోలుకు ఏకంగా రూ.1,21,600 వెచ్చించాల్సి వచ్చింది. ఈ క్రమంలో కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.26.70 కోట్లను సమీకరించింది.

తమిళనాడు కేంద్రంగా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న కంపెనీ 2006 అక్టోబరులో తన వ్యాపారాన్ని స్థాపించింది. కంపెనీ ప్రధానంగా క్రాఫ్ట్ పేపర్, పేపర్ ఉత్పత్తుల తయారీలో చురుకుగా ఉంది. కంపెనీ ప్రధానంగా వేస్ట్ పేపర్ తన ముడిసరకుగా వినియోగిస్తూ కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తోంది. కంపెనీ తన పోర్ట్‌ఫోలియోకు డ్యూప్లెక్స్ బోర్డ్, క్రాఫ్ట్ పేపర్‌లను జోడించడం ద్వారా దాని ఉత్పత్తిని విస్తరించింది. కంపెనీ ఉత్పత్తులు ఆటోమొబైల్స్, టెక్స్‌టైల్స్, FMCG, ఫుడ్, డిస్టిలరీస్, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ప్రింటింగ్ వంటి వివిధ పరిశ్రమలలో ప్యాకేజింగ్ అవసరాల కోసం వినియోగిస్తున్నారు. కంపెనీ 2024లో రూ.496.97 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇదే సంవత్సరం కంపెనీ లాభం రూ.33.42 కోట్లుగా ఉందని వెల్లడైంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+