Wagh Bakri: దేశంలో ప్రముఖ వ్యాపారి మరణానికి వీధి కుక్కలు కారణంగా మారటం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఈ వార్త ఇంటర్నెట్ లో విభిన్న వాదనలకు కారణమోతోంది.
ఇటీవలి కాలంలో దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన టీ బ్రాండ్ వాఘ్ బక్రీ. దీని గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్ మరణించారు. అయితే దీనికి కారణంగా వీధి కుక్కల దాడి కావటం అందరికీ బాధ కలిగిస్తోంది. వివరాల్లోకి వెళితే.. 49 ఏళ్ల పరాగ్ దేశాయ్ తన అహ్మదాబాద్ ఇంటి బయట వీధికుక్కలు వెంబడించటంతో కింద పడిపోయారు. ఈ క్రమంలో ఆయన మెదడులో రక్తస్రావం అయ్యింది. దీనికోసం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా వారం తర్వాత అక్టోబర్ 22న మరణించారు.

తాజాగా పరాగ్ దేశాయ్ మరణం మరోసారి వీధి కుక్కల దాడులు, ఈ వివాదాస్పద సమస్య చుట్టూ ఉన్న చట్టాలపై దృష్టి సారించేలా చేసింది. దీనిపై సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ ఎక్స్లో పెద్ద చర్చకు దారితీసింది. మారుతున్న నగర జీవనశైలి, నగరాల అభివృద్ధి మనుషులపై కుక్కల దాడులు పెరగటానికి కారణంగా కొందరు అభిప్రాయపడుతున్నారు. ఉదయం వాకింగ్ కి వెళ్లే వారు వీధి కుక్కల నుంచి రక్షణ కోసం కర్రను తీసుకెళ్లాలని సీనియర్ ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా ట్వీట్ చేశారు. ఒక వేళ మీ ప్రాంతాలో జంతు ప్రేమికులు ఉన్నట్లయితే పెద్ద కర్రను తీసుకెళ్లాలని ట్వీట్ చేయటంపై కొందరు మద్దతు ఇవ్వగా మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారతదేశంలోని రోడ్లు, వీధులు జాగింగ్, మార్నింగ్ వాక్ వంటి వాటికి సురక్షితమైనవి కాదంటూ ప్రాజెక్ట్ఫిట్కో వ్యవస్థాపకుడు చిరాగ్ బర్జాత్యా ట్వీట్ చేశారు. కుక్కలు ఆకలితో ఉన్నప్పుడు లేదా బెదిరింపులకు గురైనప్పుడు దూకుడుగా ఉంటాయని అందరికీ తెలిసిన విషయమేనని బలరాం విశ్వకర్మ అనే వ్యక్తి ట్వీట్ చేశారు. అయితే జంతు ప్రేమికులు మాత్రం ఇది దురదృష్టకరమైన సంఘటన అని కుక్కల సంతతి విషయంలో స్థానిక అధికారులు తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications