హార్ముజ్ జలసంధిలో చమురు ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణి దాడి.. భారత నావికుడు మృతి, మరో 8 మందికి గాయాలు

పశ్చిమాసియాలో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా మారాయి. దాడి ప్రతిదాడులతో దద్దరిల్లుతోంది. అమెరికా-ఇరాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. తాత్కాలిక శాంతి ఒప్పందంతో పరిస్థితులు చక్కబడతాయనుకుంటే పరిస్థితి వేరేలా తయారయింది. అమెరికా రెచ్చగొట్టే వ్యాఖ్యలతో మళ్లీ అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. హార్ముజ్ జలసంధి మీద పట్టుకోసం రెండు దేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. మిస్సైళ్లతో దానిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని చూస్తున్నాయి.

తాజాగా మంగళవారం నాడు హార్ముజ్ జలసంధిలో ఇరాన్ క్రూయిజ్ క్షిపణులు.. రెండు యూఏఈ చమురు ట్యాంకర్లపై దాడి చేయడంతో ఒక భారతీయ సిబ్బంది మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్‌ల మధ్య కొనసాగుతున్న వార్ లో ఈ దాడి మరో కీలక ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సంఘర్షణ కారణంగా గల్ఫ్‌లో వాణిజ్య నౌకాయానం తరచుగా ముప్పునకు గురవుతోంది.

Iran Missile Attack Strait of Hormuz Indian Sailor Oil Tanker Attack Iran News Middle East Tensions Oil Tankers Global Oil Market Crude Oil Prices Shipping News World News International News Business News

ఈ దాడికి ఇరాన్ కారణమని యూఏఈ ఆరోపించింది. ఇది అంతర్జాతీయ చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా, ముఖ్యమైన చమురు రవాణా మార్గాలలో ఒకదాని వెంబడి ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఈ సంఘటన జరిగింది. అమెరికా.. ఇరాన్‌పై తన దాడులను పునఃప్రారంభించింది. ట్రంప్ మరిన్ని దాడులు చేస్తామని ప్రతిజ్ఞ చేయడంతో పాటు.. హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై సుంకం విధించాలని ప్రతిపాదించారు. దీనికి ప్రతిగా ఇరాన్, బహ్రెయిన్, కువైట్, ఒమన్, జోర్డాన్‌లపై దాడులు చేసింది. వాషింగ్టన్ తమ దక్షిణ తీరంపై జరిపిన తాజా బాంబు దాడులకు ప్రతీకారంగా అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామని పేర్కొంది. ఇంధన సరఫరాలకు అంతరాయం కలుగుతుందనే భయాలు పెరగడంతో.. ఈ తాజా ఉద్రిక్తత ప్రపంచ చమురు ధరలను మరింత పెంచింది.

యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ఎక్స్‌లో పంచుకున్న సమాచారం ప్రకారం.. మొంబాసా, అల్ బహియా అనే రెండు చమురు ట్యాంకర్లు హార్ముజ్ జలసంధి దక్షిణ షిప్పింగ్ మార్గం గుండా ప్రయాణిస్తుండగా దాడికి గురయ్యాయి. దాడి జరిగినప్పుడు ఆ నౌకలు ఒమన్ ప్రాదేశిక జలాల్లో ఉన్నాయి. మరణించిన భారత జాతీయుడు మొంబాసా నౌకలో పనిచేస్తున్నాడని మంత్రిత్వ శాఖ తెలిపింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇంకా వివరాలను ధృవీకరించలేదు.

Also Read

ఈ దాడిలో ఒకరి మరణంతో పాటుగా..మరో ఎనిమిది మంది సిబ్బంది గాయపడ్డారు. వారిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఎనిమిది మందిలో ఆరుగురు భారత జాతీయులు కాగా, మిగిలిన ఇద్దరు ఉక్రెయిన్ జాతీయులు. క్షిపణి దాడుల వల్ల రెండు నౌకలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. నౌకలలో మంటలు చెలరేగడం వల్ల ఆస్తి నష్టం కూడా జరిగిందని యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అత్యవసర బృందాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చాయని, రెండు ట్యాంకర్లలో మంటలను అదుపులోకి తీసుకువచ్చామని తర్వాత ధృవీకరించింది.

ఈ క్షిపణి దాడిని యూఏఈ తీవ్రంగా ఖండించింది. ఇది ప్రాంతీయ భద్రతకు ముప్పు కలిగించే దాడిగా అభివర్ణించింది. ఈ దాడులు అంతర్జాతీయ చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమే అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే ప్రమాదకరమైన ఉద్రిక్తత పెరిగితే ప్రతిస్పందించే పూర్తి హక్కు తమ దేశానికి ఉందని కూడా తెలిపింది. యూఏఈ సాయుధ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, దేశ సార్వభౌమత్వాన్ని, జాతీయ ప్రయోజనాలను కాపాడటానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాయని కూడా అది పేర్కొంది. ప్రజలు వదంతులు లేదా సోషల్ మీడియాలోని ధృవీకరించని పోస్టులపై ఆధారపడవద్దని.. తాజా సమాచారం కోసం అధికారిక వర్గాలను మాత్రమే అనుసరించాలని మంత్రిత్వ శాఖ కోరింది.

దాదాపు అదే సమయంలో, ఒమన్‌లోని ఖల్హాత్‌కు ఈశాన్యంగా సుమారు 40 నాటికల్ మైళ్ల దూరంలో మరో ట్యాంకర్‌ను గుర్తుతెలియనిది ఏదో ఢీకొట్టిందని యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) ఏజెన్సీ నివేదించింది. ఓడ కెప్టెన్ ప్రకారం.. ఆ నౌక యొక్క ఇంజిన్ రూమ్ దెబ్బతింది. అయితే ఆ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. యూకేఎమ్‌టీఓ నివేదికకు.. రెండు యూఏఈ ట్యాంకర్లపై జరిగిన దాడికి సంబంధం ఉందో లేదో ఇంకా స్పష్టత రాలేదు. ఈ రెండు ఘటనలపైనా ఇరాన్ ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. మరోవైపు, హార్ముజ్ జలసంధి గుండా చట్టవిరుద్ధంగా ప్రయాణిస్తున్నాయని ఆరోపించబడిన నౌకలపై తమ దేశ విప్లవ దళాలు హెచ్చరిక కాల్పులు జరిపాయని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ పేర్కొంది. అయితే ఈ వాదన స్వతంత్రంగా ధృవీకరించబడలేదు.

అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య ఘర్షణ తీవ్రమవుతున్న తరుణంలోనే ఈ తాజా దాడి జరిగింది. గత కొన్ని రోజులుగా పరిస్థితి మరింత దిగజారింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఇరాన్ లక్ష్యాలపై మరో విడత దాడులు జరిపినట్లు అమెరికా సైనిక సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) తెలిపింది. ఆ దాడుల అనంతరం బందర్ అబ్బాస్, కిష్ ద్వీపంలో పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా నివేదించింది. అధ్యక్షుడు ట్రంప్ తిరిగి విధించిన ఇరాన్ ఓడరేవులు, తీరప్రాంతాల దిగ్బంధనం జూలై 14న రాత్రి 20:00 GMTకి ప్రారంభమవుతుందని అమెరికా సైన్యం కూడా ప్రకటించింది. ఇరాన్ హార్ముజ్ జలసంధికి శాశ్వతంగా సంరక్షకుడిగా ఉంటుందని విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+