అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావం ఇవాళ భారత స్టాక్ మార్కెట్పై స్పష్టంగా కనిపించింది. టారిఫ్ ప్రకటించే వరకు లాభాల వైపు ముందుకు సాగిన మార్కెట్, రెండో రోజు క్షీణతతో ముగిసింది. ఏప్రిల్ 3న షేర్ మార్కెట్ రెడ్ మార్కులో ముగియగా , నేడు అంటే ఏప్రిల్ 4న భారీ ప్రకంపనలతో నష్టాల్లో కుప్పకూలింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) సెన్సెక్స్ 930.67 పాయింట్లు తగ్గి 75,361.49 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) నిఫ్టీ 345.65 పాయింట్లు తగ్గి 22,904.45 వద్ద ముగిసింది.

నేడు స్టాక్ మార్కెట్లో కేవలం 1081 షేర్లు మాత్రమే లాభపడగా, ఏకంగా 2721 షేర్లు నష్టాల బాట పట్టాయి. 131 షేర్లలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. మదుపర్లు ఈక్విటీ హోల్డింగ్లను విక్రయించడంతో ఒక్కసారిగా 11 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది. నిఫ్టీ 50 సూచికలో, ONGC, హిందాల్కో, సిప్లా వంటి దిగ్గజ కంపెనీలు వరుసగా ఆరు శాతానికి పైగా కుప్పకూలాయి. సుంకాల భయాలతో అమ్మకాలు ఊపందుకోవడంతో మార్కెట్ మరింత క్షీణించింది. ఆటో, ఫార్మా, ఐటీ, మెటల్ రంగాల సూచీలు భారీగా పడిపోవడంతో, అన్ని రంగాల సూచీలు నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ మిడ్క్యాప్ 100 , నిఫ్టీ స్మాల్క్యాప్ 100 మధ్యాహ్నం సెషన్లో మూడు శాతం వరకు పడిపోవడంతో చిన్న , మధ్య తరహా మార్కెట్లు కూడా తీవ్రంగా నష్టపోయాయి.
అమెరికా ప్రకటించిన కొత్త సుంకాల వల్ల భారతదేశంలోని చాల రంగాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఈ భయాల కారణంగా, ఈరోజు ఫార్మా ఇండెక్స్ 4% కంటే పైగా క్షీణతతో ముగిసింది. ఇదే రోజున సిప్లా లిమిటెడ్ షేర్లు దాదాపు ఆరు శాతం తగ్గాయి. బయోకాన్ కూడా దాదాపు భారీ స్థాయిలో నష్టాలను చవిచూసింది. అదేవిధంగా డాక్టర్ రెడ్డీస్ కూడా ట్రేడింగ్ సమయంలో నష్టాల్లోనే ఉంది. అయితే, మ్యాన్కైండ్ ఫార్మా స్వల్ప లాభాల్లో కొనసాగింది. ఫార్మా లాగే నిఫ్టీ ఆటో, ఐటీ, మెటల్ సూచీలు కూడా ఒత్తిడిలో కొనసాగాయి.
రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయంటే : భారతదేశంపై విధించిన సుంకాలు చాల ఇతర దేశాల కంటే తక్కువగా ఉన్నప్పటికీ, అమెరికా ప్రతీకారం తీర్చుకుందని, ఈ ప్రభావం కొన్ని రంగాలపై కనిపిస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ కారణంగానే షేర్ మార్కెట్ ఆందోళన ట్రేడవుతుండగా, పెట్టుబడిదారులు భయపడుతున్నారు. నిజానికి ఇప్పుడు కొత్త సుంకాల యుద్ధం భయం తలెత్తింది. యూరోపియన్ యూనియన్, చైనాతో సహా ఇతర దేశాలు అమెరికన్ ఉత్పత్తులపై తిరిగి సుంకాలను పెంచవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ అనిశ్చితి కొంతకాలం ఉండవచ్చు.
ఈరోజు సెన్సెక్స్లో అతిపెద్ద పతనం టాటా స్టీల్ షేర్లలో కనిపించింది. టాప్ 30 కంపెనీలలో టాటా స్టీల్ షేర్లు 8.59 శాతం క్షీణతతో ముగిశాయి. షేర్ మార్కెట్ క్లోసింగ్ సమయానికి టాటా మోటార్స్ షేర్లు 6.15 శాతం క్షీణతతో ట్రేడవుతున్నాయి. LT, అదానీ పోర్ట్స్, NTPC , టెక్ మహీంద్రా వంటి పెద్ద కంపెనీల పరిస్థితి నేడు దారుణంగా ఉండగా, 30 కంపెనీలలో 24 షేర్లు క్షీణతతో ముగిశాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications