స్టాక్ మార్కెట్ కళకళ! దూసుకెళ్తున్న సెన్సెక్స్, నిఫ్టీ.. సుంకాల భయాలు విడినట్టేనా..!

స్టాక్ మార్కెట్లో నేడు డోనాల్డ్ ట్రంప్ సుంకాల భయాలు విడినట్లు తెలుస్తుంది. కానీ ఏప్రిల్ 1న ఈ భయాల కారణంగానే మార్కెట్ కుప్పకూలింది. అయితే అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇవాళ్టి నుండి అంటే ఏప్రిల్ 2 నుండి భారతదేశంతో సహా ఇతర దేశాలపై పరస్పర సుంకాలను విధించనున్నారు. ఈ సుంకాలు వీటిపై ఎంత అనేది ఈ రాత్రి తేలనుంది. పరస్పర సుంకాల వల్ల స్టాక్ మార్కెట్ మాంద్యంలోకి పడిపోతుందని భావించారు, కానీ సరిగ్గా నేడు అందుకు విరుద్ధంగా జరిగింది. షేర్ మార్కెట్ ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్, నిఫ్టీ పరుగులు పెట్టాయి అలాగే ట్రేడింగ్ ముగిసే వరకు లాభాలను కొనసాగించగలిగాయి.

stockmarket update is tariff fears over Sensex nifty closed in green and treded in profits

ప్రస్తుతం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) సెన్సెక్స్ 594.54 పాయింట్ల లాభంతో 76,619.05 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) నిఫ్టీ 166.65 పాయింట్లు పెరిగి 23,332.35 స్థాయికి చేరుకుంది. మరోవైపు ఒత్తిడికి గురైన ఫార్మా, ఐటీ సూచీలు కూడా నేడు పెంపును చూశాయి. బిఎస్‌ఇలో లిస్టెడ్ కంపెనీలలో జొమాటో, టైటాన్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, మారుతి, అదానీ పోర్ట్స్, భారతి ఎయిర్‌టెల్ అత్యధికంగా లాభపడగా, ఎన్‌టిపిసి, మహీంద్రా, ఆసియన్ పెయింట్స్, నెస్లే, రిలయన్స్ నష్టాలను చూశాయి.

నిజానికి సుంకాల భయాల మధ్య స్టాక్ మార్కెట్ ఇవాళ లాభాలను ట్రేడ్ చేశాయి, దీని బట్టి చుస్తే పరస్పర సుంకాల వల్ల భారతదేశం పెద్దగా నష్టపోదనే నమ్మకం కనిపిస్తుంది. భారతదేశం కూడా 23 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా దిగుమతులపై సుంకాలను తగ్గించనున్నట్లు నివేదికలు వచ్చాయి. మంగళవారం నాడు డోనాల్డ్ ట్రంప్ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. భారతదేశం ఇప్పుడు అమెరికన్ వస్తువులపై పన్నులను తగ్గించబోతోందని నేను విన్నానని ఆయన అన్నారు.

పరస్పర సుంకాల గురించి మార్కెట్ ఇప్పటికి భయపడుతోంది, కానీ ఆందోళన మాత్రం తగ్గింది. స్టాక్ మార్కెట్లో భయాన్ని సూచించే ఇండియా వోలటాలిటీ ఇండెక్స్ (ఇండియా VIX), ఈరోజు ట్రేడింగ్ సమయంలో క్షీణతను చూసింది, ఇది మార్కెట్లో భయాందోళనలు తగ్గుతున్నాయని చూపిస్తుంది. అయితే, నిజం రేపు బయటపడుతుంది. భారత కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి నుండి ఈ పరస్పర సుంకం అమల్లోకి వస్తుంది. ఈ సమయంలో చేసిన ప్రకటన ప్రభావం రేపు భారత మార్కెట్‌పై కనిపిస్తుంది. ఈ ప్రకటనలు భారతదేశానికి తీవ్ర నష్టం కలిగిస్తే, మార్కెట్ తిరిగి మందగమనంలోకి వెళ్ళవచ్చు.

టారిఫ్‌లతో పాటు, మార్కెట్ కదలికను నిర్ణయించే ఇతర అంశాలు కూడా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఉదాహరణకు, కంపెనీల నాల్గవ త్రైమాసిక ఫలితాలు రాబోతున్నాయి. దీనితో పాటు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ సమావేశం కూడా జరగనుంది, ఇందులో వడ్డీ రేట్లకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే చాల కంపెనీల మూడవ త్రైమాసిక ఫలితాలు బలహీనంగా ఉన్నాయి, దీని ప్రభావం మార్కెట్‌పై కూడా కనిపించింది. పరస్పర సుంకం ప్రకటన తర్వాత, దానికి సంబంధించిన అనిశ్చితి తగ్గుతుందని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు. కానీ రాబోయే కొన్ని రోజుల్లో షేర్ మార్కెట్ అస్థిరతను చూడవచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+