హోలీకి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఉంటుందా.. వరుసగా 3 రోజులు.. నష్టాలకు బ్రేక్ పడుతుందా..

stockmarket holiday : హోలీ సందర్భంగా స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉంటుందా ? మార్చి 14న షేర్ మార్కెట్లో ట్రేడింగ్ ఉండదా ? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు అవును అనే వినిపిస్తుంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)ల హాలిడే క్యాలెండర్ ప్రకారం హోలీ సందర్భంగా మార్చి 14న స్టాక్ మార్కెట్‌కు సెలవు ప్రకటించింది. అయితే హోలీ పండగ ఈ వారం చివరి రోజు అంటే శుక్రవారం వస్తుంది, అంటే స్టాక్ మార్కెట్‌కు ఈ వారంలో చివరి ట్రేడింగ్ రోజు అని. అలాగే మార్చి 17న స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ తిరిగి ఓపెన్ అవుతుంది. ఎందుకంటే మార్చ్ 15 ఇంకా 16 శని, ఆదివారాలు వీకెండ్ హాలిడేస్ కాబట్టి.

ఒత్తిడి కారణంగానే : స్టాక్ మార్కెట్ చాలా కాలంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితిలో హోలీ జరుపుకున్న తర్వాత షేర్ మార్కెట్లు తెరిచచాక పెట్టుబడిదారులు ఈ ఒత్తిడి నుండి రిలీఫ్ పొందాలని చూస్తారు. డోనాల్డ్ ట్రంప్ సుంకాల విధానాలు ఇంకా డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనత వంటి చాలా కారణాల వల్ల స్టాక్ మార్కెట్ నిరంతరం ఒత్తిడిలో ట్రేడవుతోంది. నిఫ్టీ సెప్టెంబర్ గరిష్ట స్థాయి నుండి దాదాపు 15% తగ్గింది. క్షీణత పరంగా, ఈ ఇండెక్స్ 29 సంవత్సరాల రికార్డును కూడా బద్దలు కొట్టింది.

StockMarket Holidays list stockmarket will open or closed on Holi festiva Know update of holidays list

హాలీడే ఎప్పుడు ఉంటుందంటే: 2025లో షెడ్యూల్ చేసిన 14 సెలవుల్లో హోలీ హాలిడే ఒకటి. దీని తరువాత మార్చి 31 సోమవారం ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా మార్కెట్ హాలీ డే ఉంటుంది. అదేవిధంగా ఏప్రిల్ 10న శ్రీ మహావీర్ జయంతి, ఏప్రిల్ 14న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి ఇంకా ఏప్రిల్ 18న గుడ్ ఫ్రైడే సందర్భంగా మార్కెట్లో ఎటువంటి ట్రేడింగ్ ఉండదు. ఈ సంవత్సరం రెండవ అర్ధభాగం గురించి మాట్లాడుకుంటే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం, ఆగస్టు 27న గణేష్ చతుర్థి అలాగే అక్టోబర్ 21-22 తేదీలో దీపావళి వంటి ప్రముఖ హాలిడేస్ కారణంగా స్టాక్ మార్కెట్లు మూసివేయబడతాయి. డిసెంబర్ 25న క్రిస్మస్ రోజున కూడా షేర్ ఓపెన్ ఉండదు. అయితే, దీపావళి సందర్భంగా, ముహూర్త ట్రేడింగ్ కోసం స్టాక్ మార్కెట్ ఒక గంట పాటు ట్రేడ్ నిర్వహిస్తుంది.

ఇది మంచి సంకేతం అంటారా : మరోవైపు ఇదే సమయంలో డోనాల్డ్ ట్రంప్ సుంకాల విధానాల కారణంగా అమెరికన్ స్టాక్ మార్కెట్లో క్షీణత కొనసాగుతోంది. నిన్న మంగళవారం కూడా షేర్ మార్కెట్ ఎరుపు రంగులో కనిపించింది. ఈ వారం మొదట రోజున సోమవారం ప్రారంభంలో భారీ అమ్మకాల కారణంగా మూడు సూచీలు నష్టాల్లో ముగిశాయి. S&P 500 మార్కెట్ వాల్యూ 4 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ. 330 లక్షల కోట్లు) తగ్గింది. గత నెల వరకు వాల్ స్ట్రీట్ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సుంకాల విధానాల గురించి ఉత్సాహంగా ఉండేది, కానీ ఇప్పుడు అక్కడ కూడా భయాందోళన వాతావరణం నెలకొందని గమనించాలి.

ఈ విధంగా పెరుగుతున్న కష్టాలు: అమెరికన్ స్టాక్ మార్కెట్లో అమ్మకాలు అలాగే మాంద్యం కొనసాగితే అది భారత మార్కెట్‌పై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. అమెరికా ప్రపంచంలోనే అత్యంత బలమైన ఇంకా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇలాంటి పరిస్థితిలో అక్కడ జరిగే ప్రతి కదలిక భారతదేశంతో సహా ఇతర షేర్ మార్కెట్లను ప్రభావితం చేస్తుంది. గత కొన్ని నెలలుగా భారత స్టాక్ మార్కెట్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇటీవలి కాలంలో ఇందులో కొంత మెరుగుదల సంకేతాలు కనిపిస్తున్నాయి. అందువల్ల, US షేర్ మార్కెట్లో బలహీనత ఈ సంకేతాలను తొలగించవచ్చు.

స్టాక్ మార్కెట్ అంచనా: ప్రస్తుతం స్టాక్ మార్కెట్‌లో ఏదీ సరిగ్గా జరగడం లేదు. చెప్పాలంటే భారత మార్కెట్ చెడు దశలో వెళుతోంది. నిన్న మంగళవారం కూడా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సమయంలో 400 పాయింట్లు పడిపోయింది. దింతో 30 షేర్ల బిఎస్‌ఇ సెన్సెక్స్ 346.23 పాయింట్లు లేదా 0.47 శాతం తగ్గి 73,768.94 వద్దకు చేరుకుంది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 124.80 పాయింట్లు లేదా 0.56 శాతం తగ్గి 22,335.50 వద్ద ముగిసింది. అయితే స్టాక్ మార్కెట్ తరువాత కోలుకుని స్వల్ప క్షీణతతో ముగిసింది. ఇక్కడ పెట్టుబడిదారులలో భయం ఇంకా భయాందోళన పరిస్థితి కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితిలో దేశీయ బ్రోకరేజ్ హౌస్ వెంచురా సెక్యూరిటీస్ మరో భయానకమైన రిపోర్ట్ విడుదల చేసింది. దీని ప్రకారం, నిఫ్టీ మరింతగా పడిపోవచ్చు.

విశ్లేషకుల అభిప్రాయం ఏంటంటే :స్టాక్ మార్కెట్లో తాజా దిద్దుబాటు తర్వాత దేశీయ బ్రోకరేజ్ సంస్థ వెంచురా సెక్యూరిటీస్ 2025లో నిఫ్టీ ఇండెక్స్‌కు బేరిష్ అంచనాను వివరించింది. దీని వాల్యుయేషన్‌లో తగ్గుదల చారిత్రక స్టాక్ మార్కెట్ దిద్దుబాట్ల ఆధారంగా అంచనా వేయబడింది. బ్రోకరేజ్ ప్రకారం, గ్రాస్ ఆర్థిక అంశాలు ఇంకా స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ ఆధారంగా నిఫ్టీ తీవ్ర క్షీణతను చూడగలదు. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం (GFC) అలాగే 2020లో COVID-ప్రేరిత స్టాక్ మార్కెట్ పతనం వంటి గత సంక్షోభాల సమయంలో ఇండెక్స్ చూసిన కీలక వాల్యులను ఈ రిపోర్ట్ హైలైట్ చేస్తుంది.

మరోవైపు నిన్న స్టాక్ మార్కెట్‌లో అస్థిరత కనిపించింది. ఉదయం బిఎస్‌ఇ సెన్సెక్స్ అలాగే ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ పెరుగుదలతో ప్రారంభమయ్యాయి కానీ కొంత సమయం తరువాత క్షీణించాయి. ఈ విధంగా మార్కెట్ నిరంతరం పైకి క్రిందికి కదులుతూనే ఉంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) సెన్సెక్స్ 12.85 పాయింట్లు తగ్గి 74,102.32 వద్ద ముగిసింది. కాగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) నిఫ్టీ 37.60 పాయింట్లు లాభపడింది. ఈ ఇండెక్స్ ప్రస్తుతం 22,497.90 స్థాయికి చేరుకుంది. అలాగే షేర్ మార్కెట్లో అతిపెద్ద పతనం ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లలో జరిగింది. ఈ బ్యాంక్ షేర్లు 27% పైగా పడిపోయి రూ.656.80 వద్ద ముగిశాయి. ఈ పతనం కారణంగా పెట్టుబడిదారులు భారీ నష్టాలను చవిచూశారు. దీనిని ఇండస్ఇండ్ బ్యాంక్ చరిత్రలో అతిపెద్ద సింగిల్ డే పతనంగా వర్ణించబడుతోంది ఇంకా మార్చి 2020 తర్వాత అత్యల్ప స్థాయి కూడా.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+